గతంలో వాట్సాప్లో ఫిర్యాదు అందుకొని 25 మంది విద్యార్థుల భవిష్యత్తుకు మార్గం సుగమం చేశారు మంత్రి నారా లోకేశ్. ఆంధ్రప్రదేశ్కి చెందిన విద్యార్థులు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగా.. వారందరికీ జాతీయస్థాయి విద్యాసంస్థల్లో సీట్లు దక్కాయి. అయితే, ఐఐటీ మద్రాస్ తీసుకొచ్చిన కొత్త నిబంధన కారణంగా సమస్య తలెత్తింది. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మంత్రి నారా లోకేశ్కు ఓ విద్యార్థి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయగా.. వెంటనే స్పందించారు. సమస్య పరిష్కరించి.. 25 మంది విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీలాంటి జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలు దక్కేలా చేశారు.