నారా లోకేష్ అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం జరగనుందని టిడిపి ప్రకటించింది. చంద్రబాబు అరెస్ట్, అనంతరం జరిగిన పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహాలపై చర్చించనున్నారు. అలాగే జనసేన పార్టీతో పొత్తు, ఉమ్మడి కార్యాచరణ, ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైనా చర్చించనున్నారు. ఇలా రానున్న 6నెలల్లో ప్రజల్లోనే ఉండాలనే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించాలని టిడిపి భావిస్తోంది. దీనిపైనా విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.