ఏపీలో పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటులో మరో ముందడుగు: కేంద్ర మంత్రితో మేకపాటి భేటీ

First Published Jun 16, 2021, 4:51 PM IST

ఆంధ్రప్రదేశ్ లో పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా వుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అనంతరం మేకపాటి తెలిపారు. 

న్యూఢిల్లీ: ఇటీవల ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ని కలిసి పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటుపై చర్చించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి కొనసాగింపుగా ఇవాళ ఏపీలో పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటు గురించి కేంద్రమంత్రితో రాష్ట్రం తరపున పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరోసారి చర్చించారు. ఢిల్లీలోని శాస్త్రిభవన్ లో కేంద్ర మంత్రితో భేటీ అనంతరం మేకపాటి మాట్లాడారు.
undefined
''ఆంధ్రప్రదేశ్ లో పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా వుంది. రూ.25 వేల కోట్లతో పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటు కానుంది. వ్యవస్థాపక నిర్మాణాల దృష్ట్యా సమగ్ర ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు స్థాపనకు కేంద్రం ముందడుగు వేస్తోంది. పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిర్మిస్తే 50 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రానున్న 2,3 ఏళ్లలో పెట్రో కెమికల్ రంగంలో పెట్టుబడుల ప్రవాహం రానుంది. ఈస్ట్ కోస్ట్ కారిడార్ లో రూ. 25 నుంచి 30 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి'' అని మేకపాటి తెలిపారు.
undefined
''కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే అనుబంధ పరిశ్రమలు కలుపుకొని 2 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం వుంది. ఎట్టి పరిస్థితుల్లో పెట్రో కెమికల్ ప్రాజెక్టు పూర్తికి కేంద్రం నుంచి పూర్తి సహకారం వుంటుంది. ఇటీవల పెట్రోల్ లో ఇథనాల్ వినియోగం 10 శాతం నుంచి 20 శాతానికి కేంద్ర ప్రభుత్వం పెంచిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇథనాల్ రంగంలో మరిన్ని పెట్టుబడులు రానున్నాయి'' అని మంత్రిపేర్కొన్నారు.
undefined
''రిఫైనరీ సామర్థ్యం పెంచాలనుకోవడం, మొలాసిస్ ఉత్పత్తి ఎక్కువగా చక్కెర కర్మాగారాల ద్వారా వస్తున్నదాని ద్వారా ఇథనాల్ గా మార్చడం కోసం ప్రత్యేకంగా రూ.1000 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీకి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెట్రో కెమికల్ కాంప్లెక్స్ గురించి ప్రాజెక్టు రిపోర్ట్ ప్రజంటేషన్ ఇవ్వడం జరిగింది. వయోబిలిటీ గ్యాప్ ఫండింగ్ పైనా కేంద్ర, రాష్ట్ర కార్యదర్శులు ప్రణాళిక సిద్ధం చేయడానికి దిశానిర్దేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో చర్యలు తీసుకోనున్నారు. ఆ తర్వాత కేంద్రం ఆమోదంతో ప్రాజెక్టు పనులు మొదలుకానుంది. అదే జరిగితే ప్రైవేటు పెట్టుబడులు కూడా అనేకం వస్తాయి'' అన్నారు.
undefined
కేంద్ర మంత్రితో భేటీలో రాష్ట్ర మంత్రి మేకపాటితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావన సక్సేనా తదితరులు పాల్గొన్నారు.
undefined
click me!