థర్డ్ వేవ్ హెచ్చరికలు... మంత్రుల సబ్ కమిటీ కీలక నిర్ణయాలు

First Published Jun 15, 2021, 3:48 PM IST

కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో చిన్నారులకు మెరుగైన వైద్యం కోసం పీడియాట్రిక్ అంశాల్లో వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం.

అమరావతి: రాష్ట్రములో థర్డ్ వేవ్ హెచ్చరిక నేపథ్యంలో నివారణకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. చిన్నారులకు మెరుగైన వైద్యం కోసం పీడియాట్రిక్ అంశాల్లో వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం మంగళగిరి ఏపిఐఐసి భవనంలో మంగళవారం కోవిడ్ నివారణ గ్రూప్ అఫ్ మిమిస్టర్స్ సమావేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అధ్యక్షతన జరిగింది.
undefined
జనావాసాలకు దగ్గరగా ఉండేలా హెల్త్ హాబ్ లు ఏర్పాటు చేయాలని సిఎం నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో చిన్నారులకు వైద్య చికిత్స సదుపాయం కల్పించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య శ్రీ అత్యుత్తమ ఆరోగ్య పధకంగా నిలవాలని సిఎం సంకల్పమని... ఆ దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
undefined
వ్యాక్సిన్ మరింతగా వేగవంతం చేయాలని... 5సంవత్సరాల లోపు తల్లులకు టీకా వేసే కార్యక్రమం ముమ్మరం చేయాలని నిర్దేశించారు. ఆరోగ్య శ్రీ పధకం ద్వారా అందిస్తున్న వైద్య సేవలు పూర్తిగా ఉచితమని నిర్ణయించారు.
undefined
థర్డ్ వేవ్ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అదేశించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా హాస్పిటల్స్ ముందుగానే పరిశీలించి అవకాశం ఉన్న చోట పిల్లలకు చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేయలని ఆదేశించారు. థర్డ్ వేవ్ లో అవసరమైన అన్ని రకాలు మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అర్హులైన తల్లులకు ఒక రోజు ముందుగానే వ్యాక్సిన్ టోకెన్స్ పంపిణికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
undefined
బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకిన వారికి అన్ని హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం అందించడానికి ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టాలని ఆదేశించారు. ఇంజక్షన్స్ బ్లాక్ మార్కెట్ లో విక్రయాలు జరిగితే కఠినంగా వ్యవహారించాలని వైద్య అధికారులకు సూచించారు.
undefined
కరోనా కేసులు తగ్గు ముఖం పట్టిన అప్రమత్తంగా ఉండాలని అధికారులకు కమిటీ సూచించింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 2వేలకు పైబడి బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని గుర్తుచేశారు. చిన్న పిల్లలుకు వైద్యం అందించడానికి అదనంగా వైద్యులు, సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని హాస్పిటల్స్ లో బెడ్స్ అందుబాటులో ఉంచాలని కమిటీ ఆదేశించింది.
undefined
ఈ సమావేశంలో సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, కురసాల కన్నబాబు, రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి, డాక్టర్ సిదిరి అప్పలరాజు, పలువురు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
undefined
click me!