విశాఖలో ఎన్నారై ఫ్యామిలీ మృతి: పెద్ద కుమారుడి పనే, సీపీ అనుమానం

First Published Apr 15, 2021, 11:02 AM IST

ఇంట్లో మంటలు వ్యాపించడానికి ముందు గొడవ జరిగిందని ఆయన చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు.  సంఘటన ఈ తెల్లవారు జామున జరిగిందని చెప్పారు.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గల మధురవాడులోని ఆదిత్య ఫార్చూన్ లో జరిగిన నలుగురు ఎన్నారై కుటుంబ సభ్యుల మృతిపై కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ మరణాల వెనక బంగారునాయుడి పెద్ద కుమారుడు దీపక్ (22) పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పెద్ద కుమారుడిపై తమకు అనుమానాలున్నాయి పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా చెప్పారు.
undefined
బంగారు నాయుడి పెద్ద కుమారుడికి మానసిక సమస్య ఉందని ఆయన చెప్పారు. పెద్ద కుమారుడి దేహంపై తప్ప మిగతా ముగ్గురి శరీరాలపై గాయాలున్నట్లు ఆయన తెలిపారు కుటుంబ కలహాలే ఈ సంఘటనకు కారణం కావచ్చునని ఆయన అన్నారు. అన్ని కోణాల్లో సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంట్లో మంటలు వ్యాపించడానికి ముందు గొడవ జరిగిందని ఆయన చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. సంఘటన ఈ తెల్లవారు జామున జరిగిందని చెప్పారు.
undefined
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలోని మధురవాడలో గల ఆదిత్య ఫార్చూన్ టవర్స్ లో భీతావహ వాతావరణం నెలకొంది. మంటల్లో సజీవ దహనమయ్యారని అనుమానించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని హత్య చేశారనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎన్నారై కుటుంబం ఆదిత్య ఫార్చూన్ లో మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.
undefined
అపార్టుమెంటులోని ఫ్లాట్ లో రక్తం పారిన గుర్తులు కనిపించాయి. గోడలపై రక్తం మరకలు ఉన్నాయి. రక్తం మడుగులో మృతదేహాలు పడి ఉన్నాయి. ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మృతదేహాలపై బియ్యం పోసిన గుర్తులు కనిపించాయి. పోలీసు కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల బంధువులు కూడా వచ్చారు. పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
undefined
విశాఖపట్నం మధురవాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మధురవాడలోని ఆదిత్య ఫార్చూన్ టవర్స్ లో ఆ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.
undefined
అయితే ఘటనా స్థలంలో రక్తం మరకలు కనపించాయి. దీంతో మరణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిని హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.
undefined
ఆ సంఘటన గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగింది. ఆదిత్య ఫార్చూన్ టవర్స్ లో దాదాపు వంద ఫ్లాట్స్ ఉంటాయి. మృతులను బంగారు నాయుడు, నిర్మల, దీపక్, కశ్యప్ లుగా గుర్తించారు. బంగారునాయుడు ఆ ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేస్తున్నట్లు తెలుసతోంది.
undefined
మృత్యువాత వడిన ఎన్నారై కుటుంబం 8 నెలల క్రితం అపార్టుమెంటులోకి వచ్చారు. ఆ కుటుంబం విజయనగరం జిల్లా గంట్యాడ నుంచి వచ్చి ఈ అపార్టుమెంటులో ఉంటుంది.
undefined
click me!