జనసేన అంతిమ లక్ష్యమిదే: మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్
First Published Nov 17, 2020, 3:22 PM ISTమంగళగిరి: ఐదు నియోజకవర్గాల్లో ముగిసిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియపై ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్రం కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ... అధికారం తాలూకు అంతిమ లక్ష్యం వేల కోట్లు కూడగట్టుకోవడం కాదు... ప్రజలు కోల్పోయిన వాటిని అందచేయడమని.. అది జనసేన చేస్తుందన్నారు. సమస్యను ఎత్తి చూపితే వ్యక్తిగత దూషణలకు దిగడం మినహా దాన్ని పరిష్కరిద్దామన్న ఆలోచన పాలకులు, అధికార పక్షంలో లేదని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.