నేతలకు బాబు ఫోన్: వ్యూహాత్మక అడుగులు, కలిసొచ్చేనా?

First Published Oct 30, 2020, 5:02 PM IST

ఏపీ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు అధికారంలోకి తీసుకువచ్చేందుకు చంద్రబాబునాయుడు సంస్థాగతంగా  బలోపేతం చేసే ప్రయత్నాలు ప్రారంభించాడు

పార్టీలో కీలకంగా పనిచేస్తున్న కొందరు నేతలకు చంద్రబాబు పదవులు కేటాయించలేదు. ఏ కారణం చేత పదవులు కేటాయించలేదో చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు స్వయంగా ఫోన్ చేసి వివరించాడు.
undefined
టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను ప్రకటించారు. టీడీపీ తెలంగాణ అధ్యక్ష పదవిని మరోసారి ఎల్. రమణకు కట్టబెట్టారు.
undefined
ఏపీలో కళా వెంకట్రావు స్థానంలో అచ్చెన్నాయుడుకు బాధ్యతలు అప్పగించారు. పార్లమెంటరీ కమిటీలకు కూడ చంద్రబాబునాయుడు అధ్యక్షులను ప్రకటించారు. వీటిలో కూడ ఎక్కువగా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు.
undefined
అచ్చెన్నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర కమిటీని త్వరలోనే కూర్పు చేయనున్నారు.ఏపీ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత చాలా మంది నేతలు పార్టీకి దూరంగా ఉన్నారు. కొందరు నేతలు క్రియాశీలకంగా ఉన్నారు. వారిపై కేసులు నమోదయ్యాయి.
undefined
పార్టీ కోసం పనిచేస్తున్నా కూడ తమకు కమిటీల్లో పదవులు దక్కకపోవడంతో కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని తమ అనుచరుల వద్ద వ్యక్తం చేస్తున్నారు.
undefined
వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు... పార్టీ కార్యక్రమాల్లో ఎవరూ పాల్గొంటున్నారనే విషయమై చంద్రబాబు ఆరా తీశారు.పార్టీ కోసం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరు పని చేస్తున్నారనే విషయమై చంద్రబాబు జిల్లాల నుండి సమాచారం తెప్పించుకొన్నారు.ఈ మేరకు పార్టీ పదవుల్లో వారికే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే కొన్ని జిల్లాల్లో కొందరి నేతలను పార్టీ పదవుల్లో సర్ధుబాటు చేయలేకపోయారు.
undefined
కేసులు పెట్టినా కూడ కొందరు నేతలు పట్టించుకోకుండా పార్టీ కోసం పని చేస్తున్నారు. అయితే పార్టీ కోసం పనిచేస్తున్న నేతలకు కూడ సామాజిక సమీకరణాలతో పదవులు ఇవ్వలేకపోయినట్టు కొందరికి చంద్రబాబు ఫోన్ చేసీ చెప్పారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పదవులు రాని నేతలకు రానున్న రోజుల్లో ప్రాధాన్యం కల్పిస్తామని బాబు హామీ ఇచ్చారు.
undefined
2014లో పదవులు అనుభవించిన కొందరు నేతలు ఇతర పార్టీల్లో చేరారు. మరికొందరు అంత క్రియాశీలకంగా లేరు. మరికొందరు నేతలు స్ధబ్దుగా ఉంటున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని పదవుల పంపకంలో నేతల ఎంపిక చేసినట్టుగా పార్టీ వర్గాల్లో అభిప్రాయం నెలకొంది.
undefined
click me!