బల్దియాలో విజయం కోసం... బిజెపి కార్యాలయంలో గణపతి హోమం

First Published Nov 30, 2020, 1:23 PM IST

రేపు(మంగళవారం) జిహెచ్ఎంసీ పరిధిలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఇవాళ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో గణపతి హోమం నిర్వహించారు. 
 

హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా జరిగి బిజెపి అభ్యర్థులకు విజయం సిద్దించాలని కోరుకుంటూ తెలంగాణ బిజెపి గణనాథున్ని వేడుకుంది. రేపు(మంగళవారం) జిహెచ్ఎంసీ పరిధిలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఇవాళ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో గణపతి హోమం నిర్వహించారు.
undefined
పార్టీ కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాసులు, బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీత మూర్తి తదితరులు పాల్గొన్నారు.
undefined
ఆ విఘ్ననాయకుడి ఆశిస్సులతో విఘ్నాలన్ని తొలగి గ్రేటర్ లో బిజెపి విజయం సాధిస్తుందన్న నమ్మకంతో వున్నామని ఆ పార్టీ నాయకలు పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యధిక డివిజన్లలో విజయం సాధించి కాషాయ జెండా రెపరెపలాడిస్తామని అన్నారు.
undefined
click me!