ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గాలపై టీడీపీ కేంద్రీకరించింది. 2014, 2019 ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా వల్లభనేని వంశీ పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేశారు. వైసీపీకి జై కొట్టారు.