జగన్ మామయ్య బర్త్ డే గిప్ట్... గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ షురూ (ఫోటోలు)
First Published Dec 21, 2022, 4:07 PM ISTబాపట్ల : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పుట్టినరోజున అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ లు పంపిణీ చేసే పథకాన్ని ఇవాళ జగన్ ప్రారంభించారు. బాపట్ల జిల్లా యడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేసారు సీఎం. తమకు అందించిన ట్యాబ్స్ లో సీఎంతో సెల్ఫీలు దిగుతూ, సరదాగా ముచ్చటిస్తూ ఆనందంగా గడిపారు చిన్నారులు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు.
ప్రభుత్వ పాఠశాల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులతో పాటు గవర్నమెంట్ ఉపాధ్యాయులకు కూడా ప్రభుత్వం ట్యాబ్ లు పంపిణీ చేయనుంది. ఇలా మొత్తం 4 లక్షల 59 వేలకు పైగా విద్యార్థులకు, 59 వేలకు పైగా ఉపాధ్యాయులకు ఈ నెల 28 వరకు ట్యాబ్ లను పంపిణీ చేయనుంది జగన్ సర్కార్.