భారత్ జోడో యాత్ర ... కర్నూలు జిల్లాలో రాహుల్ గాంధీ పాదయాత్ర (ఫోటోలు)
First Published Oct 18, 2022, 3:41 PM ISTకర్నూల్ : కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆ పార్టీ అధినాయకత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ దేశ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు భారత్ జోడో యాత్ర పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సాగే ఈ పాదయాత్ర ఇప్పటికే పలు దక్షిణాది రాష్ట్రాల్లో ముగిసి తాజాగా ఏపీలో అడుగుపెట్టింది. ఆంధ్ర ప్రదేశ్ లో పాదయాత్ర చేస్తున్న రాహుల్ ను కలిసేందుకు యువత, చిన్నారులు, కార్మికులు, కర్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ పాదయాత్రలో భారీగా పాల్గొంటున్నారు. కర్నూల్ జిల్లాలో ఈ పాదయాత్ర నాలుగు రోజులపాటు కొనసాగనుంది.