బిజెపి-జనసేన మిత్రపక్షాల దూకుడు...పవన్ కల్యాణ్ తో సోము వీర్రాజు భేటీ
First Published Aug 7, 2020, 12:56 PM ISTహైదరాబాద్: ఇటీవలే ఏపీ బిజెపి అధ్యక్ష పదవిని చేపట్టిన సోము వీర్రాజు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. అందులోభాగంగా జనసేన పార్టీ నాయకత్వంతో మరింత సన్నిహితంగా పనిచేసే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిని కలిసిన ఆయన తాజాగా జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ను కలిశారు.
కొద్దిసేపటి క్రితమే వీర్రాజు మర్యాదపూర్వకంగా పవన్ కల్యాణ్ ను కలిశారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో సోము వీర్రాజు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.