ఇందుకు సంబంధించిన వివరాలను నాదెండ్ల మనోహర్ వివరించారు.
"రైతు మొదట తన ఆధార్ నెంబర్ నమోదు చేసిన తరువాత.. రైతు పేరును ధృవీకరించాలి.
అనంతరం ధాన్యం అమ్మదలచిన కొనుగోలు కేంద్రం పేరు సెలక్ట్ చేసుకోవాలి.
తరువాత ధాన్యం అమ్మదలిచిన తేదీ సంబంధించి మూడు ఆప్షన్లు ఇస్తారు. దానిలో ఏదో ఒక తేదీని నిర్ణయించాలి.
అనంతరం టైమ్ కూడా సెలెక్ట్ చేయాలి.
ఆ పైన ఎలాంటి రకం ధాన్యం అమ్ముతున్నారో ప్రత్యేక ఆప్షన్ ఉంటుంది. అనంతరంఎంత మేర ధాన్యం బస్తాల రూపంలో అమ్మదలిచారో తెలియజేయాలి.
అనంతరం ఓ ప్రత్యేక సందేశం ద్వారా రైతులకు తన ధాన్యం అమ్మకం స్లాట్ బుక్ అయినట్లు ఒక కూపన్ కోడ్ వస్తుంది.