పరిశుభ్రతతో పాటు తిరుమల పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు టీటీడీ ఇటీవల చేపట్టిన కార్యక్రమాలను ఆయన అభినందించారు. ఆ తర్వాత ఆయన శ్రీ బేడి ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకుని కుటుంబ సమేతంగా అఖిలాండం వద్ద పూజలు చేశారు. స్థానిక శాసనసభ్యులు బి కరుణాకర్ రెడ్డి, సివిఎస్వో గోపీనాథ్ జట్టి, డివైఇఓలు హరీంద్రనాథ్, శ్రీ లోకనాథం, విజివో బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.