దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం 'యాత్ర'. టైటిల్ కి తగ్గట్లుగా సినిమా మొత్తం వైఎస్ పాదయాత్ర చుట్టూ తిరుగుతుంటుంది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం 'యాత్ర'. టైటిల్ కి తగ్గట్లుగా సినిమా మొత్తం వైఎస్ పాదయాత్ర చుట్టూ తిరుగుతుంటుంది. సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను మహి వి రాఘవ్ డైరెక్ట్ చేశారు.
భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 ఎంఎంఎంటర్టైన్మెంట్స్ అత్యంత భారీ వ్యయంతో, ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికులు సమీపిస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 8న యాత్ర చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. సెన్సార్ నుండి ఒక్క కట్ కూడా లేకుండా.. క్లీన్ 'యు' సర్టిఫికేట్ ని దక్కించుకుంది.
అలానే సెన్సార్ సభ్యులు సినిమాపై అభినందనలు కురిపించినట్లుగా నిర్మాతలు వెల్లడించారు. సెన్సార్ విషయంలో ఈ సినిమాకు ఇబ్బందులు తప్పవని చాలా మంది భావించారు. కానీ వారికి షాక్ ఇచ్చే విధంగా సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తవ్వడం గమనార్హం.