హిందీ ఓటిటి వెర్షన్ బ్లాక్ చేసేలా ఎగ్రిమెంట్ చేసుకుని రీమేక్ రైట్స్ తీసుకుంటారట. ఈ మేరకు బాలీవుడ్ కు చెందిన ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ రంగంలోకి దిగిందిట.
విలక్షణ నటుడు యాక్టర్ విజయ్ సేతుపతి తన 50వ సినిమా 'మహారాజ'తో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా హిందీ రైట్స్ కు బేరసారాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే హిందీ రైట్స్ అమ్మటం వరకూ సమస్య లేదు కానీ అక్కడ విజయ్ సేతుపతిలా నటించేవారు ఎవరు అనేది డిస్కషన్ పాయింట్ గా మారింది.
తమిళ దర్శకుడు నిథిలన్ ఈ సినిమాను థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ జానర్లో తెరకెక్కించారు. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ కథకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక హీరో విజయ్కు ఇది 50వ సినిమా. ఇందులో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆయన నటనే సినిమాకు ప్లస్ పాయింట్ అని అంటున్నారు. అదే ఈ రీమేక్ చేసే విషయం దగ్గర సమస్యగా మారుంది.
అయితే హిందీ నిర్మాతలు ఆల్రెడీ ఈ సినిమా ని అజయ్ దేవగన్ తో చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో సినిమా చూడమని చెప్పారని తెలుస్తోంది. అజయ్ దేవగన్ కు నచ్చితే కనుక సినిమాని హిందీ ఓటిటి వెర్షన్ బ్లాక్ చేసేలా ఎగ్రిమెంట్ చేసుకుని రీమేక్ రైట్స్ తీసుకుంటారట. ఈ మేరకు బాలీవుడ్ కు చెందిన ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ రంగంలోకి దిగిందిట. ఇక అజయ్ దేవగన్ ఈ మధ్యన రీమేక్ లలో రచ్చ చేస్తున్నాడు. దృశ్యం, సైతాన్ రీమేక్ లు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. అజయ్ నో చెప్పితే అప్పుడు అక్షయ్ దగ్గరకు వెళ్తారట.
చిత్రం కథేమిటంటే...
మహారాజా (విజయ్ సేతుపతి) ఓ బార్బర్. ఒక ప్రమాదంలో భార్యను పోగొట్టుకుంటాడు. అతనికంటూ మిగిలిన ఒకే తోడు కూతురు జ్యోతి. తను ఆ బిడ్డతోనే కలిసి సిటీకి దూరంగా ఉన్న ఓ ఇంట్లో జీవిస్తుంటాడు. మహారాజా ఓరోజు ఒంటి నిండా గాయాలతో పోలీస్స్టేషన్ గడప తొక్కుతాడు. ముగ్గురు ఆగంతకులు తన ఇంట్లోకి చొరబడి తనపై దాడి చేశారని.. ఈ క్రమంలోనే తమ బిడ్డ ప్రాణాల్ని కాపాడిన లక్ష్మిని ఎత్తుకెళ్లిపోయారని.. ఎలాగైనా సరే ఆ లక్ష్మిని వెతికి పెట్టమని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. మరి మహారాజా చెప్పిన ఆ లక్ష్మి ఎవరు? అతని ఫిర్యాదును స్వీకరించడానికి పోలీసులు తొలుత ఎందుకు నిరాకరించారు? అసలు మహారాజపై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులెవరు?వాళ్లకు అతనికి ఉన్న విరోధం ఏంటి? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.
కాగా, విజయ్ సేతుపతి నటించిన ఈ 50వ సినిమా ట్రేడ్ మార్క్గా నిలిచిపోనుందని హీరోయిన్ కీర్తీ సురేశ్ రీసెంట్గా ప్రశంసించారు. ఇక సినిమాలో విజయ్తోపాటు అనురాగ్ కశ్యప్, మమతా మోహన్దాస్, అభిరామి, నటరాజ్, భారతీరాజా, నటరాజ్, అరుళ్ దాస్, బాయ్స్ మణికందన్, వినోద్ సాగర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సుదాన్ సుందరం, జగదీశ్ పళనిస్వామి నిర్మించగా, అజనీశ్ లోక్నాథ్ సంగీతం అందించారు.