బాలయ్య ‘వీరసింహారెడ్డి’లో ‘కేజీఎఫ్’ నటుడు.. వైరల్ అవుతున్న పిక్!

By team teluguFirst Published Nov 14, 2022, 6:41 PM IST
Highlights

నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహా రెడ్డి’. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ మూవీలో కేజీఎఫ్ విలన్ నటించబోతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. 
 

నందమూరి నటసింహం, సీనియర్ హీరో బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అభిమానులు, తెలుగు ఆడియెన్స్ ఫుల్ ఖుషీ చేస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్స్ తో దుమ్ములేపుతున్న బాలయ్య అదిరిపోయే కంటెంట్ తో అలరిస్తున్నారు. రీసెంట్ గా ‘అఖండ’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ‘వీరసింహా రెడ్డి’ (Veera Simha Reddy)లో నటిస్తున్నారు. నిన్నటితో లేటెస్ట్ షెడ్యూల్ పూర్తి అయ్యింది. అనంతపురం జిల్లాలో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. 

మాస్ డైరెక్టర్ గా తన మార్క్ చూపిస్తున్న గోపీచంద్ మాలినేని (Gopichand Malineni)‘వీరసింహా రెడ్డి’కి  దర్శకత్వం వహిస్తున్నారు. అయితే బాలయ్య సినిమాల్లో విలన్ కు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ క్రమంలో వీరసింహారెడ్డిలో విలన్ గా కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలో తాజాగా మరో విలన్ పేరు కూడా వినిపిస్తోంది. కేజీఎఫ్ లో ఆండ్రూ పాత్రలో నటించిన కన్నడ నటుడు అవినాశ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. గంగిరెడ్డి అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. బాలయ్యకు, అవినాశ్ కు మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయని అంటున్నారు. 

నిన్నటి వరకు ‘వీరసింహారెడ్డి’ చిత్ర షూటింగ్ అనంతపురం జిల్లాలో కొనసాగింది. ఐదురోజుల పాటు పెన్నోహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, అమిధ్యాల, రాకెట్ల, ఉరవకొండ, పెనుగొండ ఫోర్ట్ వద్ద షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి వస్తున్న క్రేజీ అప్డేట్స్ కు సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. బాలయ్య సరసన హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) నటిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కాబోతోంది. 

click me!