SSMB28 : త్రివిక్రమ్ - మహేశ్ సినిమా స్టార్ట్ అయ్యేది ఎప్పుడు.. షూటింగ్ పై మేకర్స్ కీలక నిర్ణయం!

By team teluguFirst Published Nov 26, 2022, 4:05 PM IST
Highlights

పదేండ్ల తర్వాత సెట్ అయిన సూపర్ స్టార్ మహేశ్ బాబు - దర్శకుడు త్రివిక్రమ్ కాంబోకు అంతరాయాలు ఏర్పడుతూనే ఉన్నాయి. నెక్ట్స్ షెడ్యూల్ మొదలు పెట్టేముందుకు మేకర్స్ షూటింగ్ పై కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
 

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) - దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ28’. ఈపాటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. ఇంకా షూటింగ్ పార్ట్ కూడా పూర్తి చేసుకోలేకపోయింది. గతేడాది మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా సినిమాను అనౌన్స్ చేశారు. మహేశ్ బాబు ఇంట్లో వరుస విషాదాలు నెలకొనడంతో సినిమా అంతకంతకూ ఆలస్యం అవుతోంది. వుస్తోంది. అన్న రమేశ్ బాబు, తల్లి ఇందిరా దేవి, రీసెంట్ గా తండ్రి కృష్ణ కూడా చనిపోవడంతో మహేశ్ శోకసంద్రంలో మునిగిపోయారు. 

ఈ ఏడాది అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్లిన ‘ఎస్ఎస్ఎంబీ 28’ కృష్ణ మరణంతో మళ్లీ షూటింగ్ ఆగిపోయింది. ఇప్పటికే  ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. కంటిన్యూ అవుతుందని భావించినా గ్యాప్ వచ్చింది. ఇక మళ్లీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్బంగా క్రేజీ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. ఇప్పటికే ఆలస్యం అవుతున్న ఈ చిత్రాన్ని వీలైనంత తర్వగా పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

ఫస్ట్ షెడ్యూల్ పూర్తవడంతో.. నెక్ట్స్ షెడ్యూళ్లపై త్రివిక్రమ్, మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ షూటింగ్ ను డిసెంబర్ మొదటి వారంలోనే ప్రారంభించాలని భావిస్తున్నారంట. ఈసారి మొదలైతే.. గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూళ్లతో పూర్తి చేయాలని అనుకుంటున్నారంట. ఇటు మహేశ్ బాబు కూడా యూనిట్ కు సహకరించే ఆలోచనలోనే ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని షెడ్యూల్ చేసినా కుదరేలా లేదు. కనీసం ఆ సమయానికి షూటింగ్ పార్ట్ నైనా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారంట. మహేశ్ ఒక్కసారి సెట్స్ లో అడుగుపెడితే సినిమాను పూర్తి చేసే తీరుతారని అంటున్నారు. 

మహేశ్ బాబు ఈ చిత్రం కోసం పూర్తిగా తన మేకోవర్ ను మార్చేసిన విషయం తెలిసిందే. ఈ స్టైలిష్ అండ్ మాస్ లుక్ ను ట్రై చేస్తున్నారు. అందుకు సంబంధించినా ఫొటోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ లో అతడు, ఖలేజా తర్వాత వస్తున్న ‘ఎస్ఎస్ఎంబీ28’పై భారీ అంచనాలే ఉన్నారు. చిత్రాన్ని హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మిస్తున్నారు. గ్లామర్ బ్యూటీ పూజా హెగ్దే (Pooja Hegde) హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు.  

click me!