బీర్ సీసాతో ఏం సందేశం ఇస్తున్నారు..? విశాల్ సినిమాపై వివాదం!

By Udayavani DhuliFirst Published Nov 21, 2018, 3:03 PM IST
Highlights

తమిళ హీరో విశాల్ పై పీఎంకె పార్టీ స్థాపకుడు ఎస్.రామదాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కోలివుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. విశాల్ ప్రస్తుతం తెలుగులో వచ్చిన 'టెంపర్' సినిమాకు రీమేక్ 'అయోగ్య' చిత్రంలో నటిస్తున్నాడు. నూతన దర్శకుడు వెంకట్ మోహన్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 

తమిళ హీరో విశాల్ పై పీఎంకె పార్టీ స్థాపకుడు ఎస్.రామదాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కోలివుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. విశాల్ ప్రస్తుతం తెలుగులో వచ్చిన 'టెంపర్' సినిమాకు రీమేక్ 'అయోగ్య' చిత్రంలో నటిస్తున్నాడు. నూతన దర్శకుడు వెంకట్ మోహన్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో విశాల్ చేతిలో బీరు పట్టుకొని, పోలీసు జీపుపై కూర్చొని కనిపించారు. దీంతో ఈ పోస్టర్ పై వివాదం చెలరేగింది. విశాల్ ని విమర్శిస్తూ ఎస్.రామదాస్ కొన్ని కామెంట్లు చేశారు.

'నడిగర్ సంఘం సెక్రటరీగా విశాల్ కి కాస్త సామాజిక బాధ్యత ఉందని అనుకున్నాను. ఈ పోస్టర్ ద్వారా మీరేం చెప్పాలని అనుకుంటున్నారు..? మొన్న పొగతాగారు.. ఇప్పుడు బీర్ సీసాతో ఫోజులిస్తున్నారు.

విశాల్ తన సామాజిక బాధ్యతను ఇలా బయటపెడుతున్నారు' అంటూ రామదాస్ ఫైర్ అయ్యారు. రామదాస్.. 2002లో రజినీకాంత్ 'బాబా' సినిమాలో పొగ తాగుతూ నటించడాన్ని కూడా విమర్శించారు. మరి ఈ విషయంపై విశాల్ ఎలా స్పందిస్తాడో చూడాలి!
 

click me!