నా పెళ్లి విధిపై ఆధారపడి ఉందిః విశాల్‌

By Aithagoni RajuFirst Published Feb 26, 2021, 9:56 AM IST
Highlights

విశాల్‌ నటించిన ప్రతి సినిమా తెలుగులో విడుదలవుతూ ఆదరణ పొందుతున్నాయి. ఇటీవల `చక్ర` సినిమాతో ఆయన ఆడియెన్స్ ముందుకొచ్చారు. ఇది ఆశించిన రిజల్ట్ ని పొందలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన తన పెళ్ళిపై స్పందించారు. విధి ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుందని చెప్పాడు. 

విశాల్‌ కోలీవుడ్‌లో స్టార్‌ హీరోగా రాణిస్తున్నారు. తెలుగులోనూ ఆయన సినిమాలకు మంచి మార్కెట్‌ ఉంది. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో విడుదలవుతూ ఆదరణ పొందుతున్నాయి. ఇటీవల `చక్ర` సినిమాతో ఆయన ఆడియెన్స్ ముందుకొచ్చారు. ఇది ఆశించిన రిజల్ట్ ని పొందలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన తన పెళ్ళిపై స్పందించారు. విధి ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుందని చెప్పాడు. 

ఓ ఆంగ్ల మీడియాతో విశాల్‌ మాట్లాడుతూ, `ప్రస్తుతానికి నేను సింగిల్‌గానే ఉన్నా. వేరొకరితో రిలేషన్‌లోకి వెళ్లేందుకు సిద్ధంగా లేను. అంతేకాకుండా తాను విధిని నమ్ముతా. కాబట్టి దేవుడు ఎలాంటి రాతని రాస్తే జీవితం అలా కొనసాగుతుంది. ఇప్పటివరకూ అలాగే జరిగింది.  త్వరలోనే ఓ శుభవార్త చెప్పాలని రాసిపెట్టి ఉంటే, తప్పకుండా అందరికీ వెల్లడిస్తాను` అని తెలిపారు. ఇదిలా ఉంటే రెండేళ్ల క్రితం విశాల్‌ అనీషా రెడ్డితో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలను డిలీట్‌ చేశారు. దీంతో అనీషాతో ఎంగేజ్‌మెంట్‌ కాన్సిల్‌ అయ్యిందని చెప్పకనే చెప్పారు. 

ఆ తర్వాత మ్యారేజ్‌పై స్పందించలేదు విశాల్‌. మరోవైపు వరలక్ష్మీ శరత్‌ కుమార్‌తోనూ లవ్‌ లో ఉన్నట్టు వార్తలొచ్చాయి. దీన్ని వీరిద్దరు ఖండించిన విషయం తెలిసిందే. ఇక విశాల్‌ నటించిన `చక్ర` చిత్రం ఈ నెల 19న విడుదలైంది. శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటించింది. ఇక ప్రస్తుతం విశాల్‌ `తుప్పరివాలం 2` చిత్రంలో నటించబోతున్నారు.

click me!