విజ‌యేంద్ర ప్ర‌సాద్ కి క‌రోనా

By Surya PrakashFirst Published Apr 7, 2021, 6:47 PM IST
Highlights

టాలీవుడ్ స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌రోనా బారీన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయన సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌ప‌రిచారు. త‌న‌కు క‌రోనా సోకింద‌ని, త‌న‌ని ఇటీవ‌ల క‌ల‌సిన వాళ్లంతా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరారు. 

టాలీవుడ్ స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌రోనా బారీన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయన సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌ప‌రిచారు. త‌న‌కు క‌రోనా సోకింద‌ని, త‌న‌ని ఇటీవ‌ల క‌ల‌సిన వాళ్లంతా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరారు.  విజయేంద్రప్రసాద్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. తనను కలిసినవాళ్లందరూ కరోనా టెస్టులు చేయించుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజయేంద్రప్రసాద్ తెలిపారు. తన సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

ఇక రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం `ఆర్‌.ఆర్‌.ఆర్‌`కి విజయేంద్ర ప్ర‌సాద్ ర‌చ‌యిత అనే సంగ‌తి తెలిసిందే. దాంతో కథా చర్చల నిమిత్తం ఆయ‌న టీమ్ తో త‌ర‌చూ క‌లుస్తున్నారు. ఆయ‌న‌కు క‌రోనా సోక‌డంతో.. ఆర్‌.ఆర్‌.ఆర్ టీమ్ లోని కీల‌క‌మైన స‌భ్యులు ఇప్పుడు మ‌ళ్లీ క‌రోనా పరీక్ష‌లు చేయించుకోవాలి. గతంలోనూ రాజ‌మౌళి కుటుంబానికి క‌రోనా వచ్చింది.  అప్పుడు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుని బ‌య‌ట‌ప‌డ్డారు. ఇప్పుడు విజ‌యేంద్ర ప్ర‌సాద్ వంతు వ‌చ్చింది. ఆయనకు 76 సంవత్సరాలు. అన్ని జాగ్రత్తలతో ఆయన రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ఏదైమైనా ఇటీవ‌ల క‌రోనా ఇంకొంచెం గ‌ట్టిగా విజృంభిస్తోంది. ముఖ్యంగా సినీ సెల‌బ్రెటీల‌కు ఎక్కువగా వస్తోంది. అటు బాలీవుడ్ లోనూ కరోనా వేగంగా వ్యాపిస్తోంది. సెకండ్ వేవ్ లో పలువురు తారలు కరోనా బాధితుల జాబితాలో చేరారు. అమీర్ ఖాన్, గోవిందా, అక్షయ్ కుమార్, బప్పీ లహరి, అలియా భట్, మాధవన్,కత్రినా కైఫ్  వంటి సెలబ్రిటీలకు కరోనా పాజిటివ్ అని తేలింది.
 

click me!