
రౌడీబాయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్న `కింగ్డమ్` సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ మధ్య విడుదలైన టీజర్ గూస్ బంమ్స్ తెప్పించింది. సినిమాలో ఏదో విషయం ఉందనే విషయాన్ని తెలియజేసింది. అంచనాలను మరింతగా పెంచింది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆ మధ్య ఓ సాంగ్ని విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. రౌడీ కమ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేశారు.
ఇక ఈ మూవీని ఈ నెల 30న విడుదల చేయాలని భావించారు. రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. కానీ సడెన్గా ఇప్పుడు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. కొత్త డేట్ని విడుదల చేశారు. ఈ నెల 30న విడుదల కావాల్సిన ఈ మూవీని జులై 4కి వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది టీమ్. దీనికి కారణాలు కూడా వెల్లడించారు.
`మే 30న విడుదల కావాల్సిన మా 'కింగ్డమ్' సినిమాను జూలై 4న విడుదల చేయనున్నామని తెలియజేస్తున్నాము. ముందుగా అనుకున్నట్టుగా మే 30వ తేదీకే సినిమాని తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నించాము. కానీ, మన దేశంలో ఇటీవల ఊహించని సంఘటనలు జరిగాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమోషన్లు, వేడుకలు నిర్వహించడం కష్టతరమని భావించి, ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం 'కింగ్డమ్'కి మరిన్ని మెరుగులు దిద్ది, సాధ్యమైనంత ఉత్తమంగా మలచడానికి సహాయపడుతుందని మేము విశ్వసిస్తున్నాము.
కాస్త ఆలస్యంగా వచ్చినా 'కింగ్డమ్' చిత్రం అభిమానులు, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. జూలై 4న థియేటర్లలో అడుగుపెడుతున్న ఈ చిత్రం, మీ ప్రేమను పొందుతుందని ఆశిస్తున్నాము.
విడుదల తేదీ మార్పు విషయంలో తమ మద్దతు ఇచ్చినందుకు దిల్ రాజు, నితిన్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము` అని టీమ్ తెలిపింది. ఎందుకంటే అదే రోజు నితిన్ `తమ్ముడు` చిత్రం కూడా విడుదలవుతున్న విషయం తెలిసిందే.
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న 'కింగ్డమ్' చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
`విజయ్ దేవరకొండ తన కెరీర్లో అత్యంత శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో ఆయన కనిపించిన తీరు అందరినీ కట్టిపడేసింది. విజయ్ కి జోడిగా భాగ్యశ్రీ బోర్సే ఒక ఆసక్తికరమైన పాత్రలో కనిపించనున్నారు.
జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణం అత్యున్నత స్థాయిలో ఉండనుంది. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్ర ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మొదటి గీతం 'హృదయం లోపల' ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని సినిమాపై అంచనాలను మరింత పెంచింది` అని టీమ్ వెల్లడించింది.