సినిమా కాన్సెప్ట్ నచ్చడంతో విజయ్ దర్శకుడిని బాగా నమ్మాడు. నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా దర్శకుడు కథ రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కథపై ఒక రూమర్ కూడా ఉంది.
అర్జున్ రెడ్డి - గీత గోవిందం సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న విజయ్ దేవరకొండ హ్యాట్రిక్ హిట్ అందుకోలేకపోయాడు. రీసెంట్ గా వచ్చిన నోటా సినిమా ఊహించని అపజయాన్ని అందుకుంది. అసలు విషయంలోకి వస్తే ఈ హీరో నేడు ఒక కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. ఇదివరకే డియర్ కామ్రేడ్ అనే సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక క్రాంతి మాధవ్ తో ఒకే చేసిన ప్రాజెక్ట్ ను కూడా విజయ్ స్టార్ట్ చేశాడు. క్రాంతి మాధవ్ ఓనమాలు సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే మళ్ళి మళ్ళి ఇది రానిరోజు సినిమాతో కూడా కమర్షియల్ హిట్ అందుకొని తన మేకింగ్ స్టైల్ ఏంటో నిరూపించుకున్నాడు. కానీ సునీల్ తో చేసిన ఉంగరాల రాంబాబు మాత్రం డిజాస్టర్ గా నిలిచింది.
ఆ సినిమాతో దాదాపు సునీల్ హీరోగా సెట్టవ్వడని ఒక టాక్ కూడా వైరల్ అయ్యింది. అలాంటి దర్శకుడితో ఇప్పుడు విజయ్ సినిమా చేయనున్నాడు. సినిమా కాన్సెప్ట్ నచ్చడంతో విజయ్ దర్శకుడిని బాగా నమ్మాడు. నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా దర్శకుడు కథ రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కథపై ఒక రూమర్ కూడా ఉంది. ఒక కాల్ గర్ల్ లైఫ్ ని బేస్ చేసుకొని కథ నడుస్తుందని ఊహాగానాలు వస్తున్నాయి.
రెగ్యులర్ సినిమాలకు కాస్త బిన్నంగా ప్రయోగాత్మకంగా సినిమా తెరక్కనుందట. ఇక సినిమాలో విజయ్ సరసన మొదటి సారి ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. రాశిఖన్నా - ఐశ్వర్య రాజేష్ మరియు ఇజాబెల్లె సినిమాలో కథానాయికలు.ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు సినిమాను నిర్మిస్తున్నారు.