ప్రభాస్ ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజా!

By Prashanth MFirst Published Oct 22, 2018, 2:23 PM IST
Highlights

రేపు ప్రభాస్ తన 39వ పుట్టినరోజును జరుపుకోనున్నాడు. ఈ సందర్బంగా సాహో టీమ్ అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ను ప్లాన్ చేస్తోంది. 

బాహుబలి సినిమాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ సాహూతో నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టడానికి సన్నద్ధమవుతున్నాడు. యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఆ సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. సినిమా తెలుగుతో పాటు హిందీ తమిళ్ లో కూడా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 

అయితే రేపు ప్రభాస్ తన 39వ పుట్టినరోజును జరుపుకోనున్నాడు. ఈ సందర్బంగా సాహో టీమ్ అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ను ప్లాన్ చేస్తోంది. నేడు సాయంత్రం 4గంటలకు ఒక కొత్త పోస్టర్ ని విడుదల చేయనున్నారు. ఇక రేపు సాహో మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది. 

ప్రభాస్ బర్త్ డే రోజు ఫ్యాన్స్ కు ఎలాగైనా డబుల్ బొనాంజా ఇవ్వాలని చిత్ర యూనిట్ ప్లానింగ్ లో ఉన్నట్లు టాక్.  సాహోలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక రాధాకృష్ణ దర్శకత్వంలో చేయబోయే లవ్ స్టోరీని రీసెంట్ గా ప్రభాస్ ఇటలీలో స్టార్ట్ చేశాడు. ఆ సినిమాను కూడా రెబల్ స్టార్ వీలైనంత త్వరగా ఫినిష్ చెయ్యాలని కష్టపడుతున్నాడు.

click me!