`వెంకీ2`పై క్రేజీ అప్‌డేట్‌.. గుడ్‌ న్యూస్‌ చెప్పిన శ్రీనువైట్ల.. హీరో ఎవరు?

By Aithagoni RajuFirst Published Mar 25, 2024, 10:45 PM IST
Highlights

రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వచ్చిన `వెంకీ` సినిమా పెద్ద హిట్‌ అయ్యింది.  ఇప్పుడు `వెంకీ 2`కి సంబంధించిన దర్శకుడు శ్రీనువైట్ల ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చాడు.

రవితేజ సూపర్‌ హిట్‌ మూవీస్‌లో `వెంకీ` ఒకటి. శ్రీనువైట్ల రూపొందించిన ఈ మూవీ అప్పట్లో పెద్ద హిట్‌. ఇందులో కామెడీ ఎవర్‌ గ్రీన్‌. అందులోనూ ముఖ్యంగా ట్రైన్‌లో బ్రహ్మానందం, రవితేజ గ్యాంగ్‌ మధ్య వచ్చే కామెడీ ఇప్పటికీ హిలేరియస్‌గా ఉంటుంది. ఇటీవల ఈ మూవీని రీ రిలీజ్‌ చేశారు. పెద్ద హీరోల సినిమాలకు రాని క్రేజ్‌ ఈ మూవీకి రావడం విశేషం. దానికి కారణం ఆ కామెడీనే కావడం విశేషం.

Survey:వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

తాజాగా ఈ మూవీపై దర్శకుడు శ్రీను వైట్ల స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. `వెంకీ2` పై గుడ్‌ న్యూస్‌ చెప్పాడు. దీనికి సీక్వెల్‌ తీసుకురాబోతున్నట్టు తెలిపారు. అయితే ఇటీవల `వెంకీ` సినిమా రీ రిలీజ్‌ టైమ్‌లో వచ్చిన స్పందన, ఆడియెన్స్ డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకుని, తనకు సీక్వెల్‌ తీయాలనే ఆలోచన వచ్చిందట. బలంగా దానిపై కూర్చోవాలని నిర్ణయించుకున్నారట. ఆల్‌రెడీ స్క్రిప్ట్‌ పై వర్క్ చేస్తున్నట్టు తెలిపారు శ్రీనువైట్ల. 

మళ్లీ అదే కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని, కానీ ఎప్పుడు అనేది చెప్పలేనని తెలిపారు శ్రీను వైట్ల. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ఇది ఆడియెన్స్ లోనూ ఇంట్రెస్ట్ ని పెంచుతుంది. రవితేజ్‌ అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచుతుంది. అయితే ఇప్పుడు ఇది సాధ్యమేనా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం శ్రీనువైట్ల.. గోపీచంద్‌ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. కానీ బడ్జెట్‌ కారణంగా ఇది ఆగిపోయింది. నిర్మాతలు మారుతున్నారు. సినిమా అసలు ఉంటుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆ మూవీ విడుదలై హిట్‌ అయితే నెక్ట్స్ మూవీకి నిర్మాతలు, హీరో ముందుకు వస్తారు. 

ఇక ప్రస్తుతం రవితేజ.. `మిస్టర్‌ బచ్చన్‌` మూవీలో బిజీగా ఉన్నారు. బడ్జెట్‌ కారణంగా మరో రెండు సినిమాలు ఆగిపోయాయట. గోపీచంద్‌ మలినేనితో చేయాల్సిన సినిమా ఆగిపోయింది. అలాగే అనుదీప్‌తో చేయాల్సిన సినిమాపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఫెయిల్యూర్‌లో ఉన్న శ్రీనువైట్లతో రవితేజ సినిమా చేస్తాడా? అనేది డౌట్ గా మారింది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. ఇక రవితేజ హీరోగా నటించిన `వెంకీ`లో స్నేహ హీరోయిన్‌గా చేసింది. హిలేరియస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. 

Read more: 90 రూపాయలతో అయిపోయేది, 250కోట్లు ఖర్చు చేయించిన రాజమౌళి.. ఇది మరీ దారుణం?

Also read: చిరంజీవిని ఉదయ్‌ కిరణ్‌ గాడ్‌ ఫాదర్‌లా భావించేవాడు, కానీ.. తొక్కేశాడనే వార్తలపై అక్క శ్రీదేవి కామెంట్స్ వైరల్
 

click me!