విలన్ గా వరుణ్ తేజ్..?

By Udayavani DhuliFirst Published Nov 19, 2018, 2:51 PM IST
Highlights

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. 'జై లవకుశ' సినిమా ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. హీరో రానా, ఆది పినిశెట్టి వంటి నటులు కూడా విలన్ రోల్స్ లో నటించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. 

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. 'జై లవకుశ' సినిమా ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. హీరో రానా, ఆది పినిశెట్టి వంటి నటులు కూడా విలన్ రోల్స్ లో నటించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

ఇప్పుడు మెగాహీరో వరుణ్ తేజ్ కూడా విలన్ పాత్రలో కనిపించానున్నాడా..? అనే సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు హీరోగా వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసిన వరుణ్ తేజ్ ని విలన్ గా పరిచయం చేయాలని అనుకుంటున్నాడు దర్శకుడు హరీష్ శంకర్.

తమిళంలో ఘన విజయం సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'జిగర్తండ' సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒరిజినల్ కథలో సిద్ధార్థ్ హీరోగా నటించగా.. విలన్ గా బాబీ సింహా కనిపించారు. అయితే హీరో కంటే విలన్ పాత్రకే ఎక్కువ పేరొచ్చింది.

ఇప్పుడు తెలుగులో హీరో పాత్రని కాస్త డౌన్ చేసి ప్రతినాయకుడి పాత్రని మరింత హైప్ చేయాలని చూస్తున్నారట. ఆ పాత్ర కోసం వరుణ్ తేజ్ ని సంప్రదించినట్లు సమాచారం. వరుణ్ నుండి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ లేదని తెలుస్తోంది. మరి విలన్ పాత్రకి వరుణ్ ఒప్పుకుంటాడో లేదో.. చూడాలి!

click me!