మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలో తండ్రి కాబోతున్నారు. తన జీవితంలోకి మూడో వ్యక్తి రాబోతున్నారు. ఆయన భార్య, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది. ఈ విషయాన్ని ఇటీవలే వరుణ్ తేజ్, లావణ్య సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ క్రమంలో తన భార్య కోసం వరుణ్ అనేక ప్రయోగాలు చేస్తున్నారు.
వరుణ్ తేజ్ ఇప్పుడు చెఫ్గా మారారు. తన భార్య కోసం టేస్టీగా పిజ్జా తయారు చేశారు. ఎంతో శ్రద్ధతో పిండి కలిపి, అందులో యాడ్ చేయాల్సిన ఐటెమ్స్ అన్ని పద్ధతిగా యాడ్ చేసి చాలా ఓపికగా ఈ పిజ్జాని తయారు చేశారు. దాన్ని వేడి చేస్తుంటే వచ్చిన కలర్ పిజ్జా సెంటర్లలో కూడా అంత బాగా ఉండవేమో. చూడగానే నోరూపోతుంది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని లావణ్య త్రిపాఠి తన ఇన్ స్టాగ్రామ్లో పంచుకోవడం విశేషం. ఈ వీడియోని అభిమానులతో షేర్ చేస్తూ నన్ను క్రస్ట్ చేయండి, ఆయనొక కీపర్ అంటూ పోస్ట్ పెట్టింది.
ఇది మరింత వైరల్గా మారింది. ఈ క్రమంలో దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. పిజ్జా అదిరిపోయిందని, నోరూరిపోతుందని అంటున్నారు. తమకు ఒక పీస్ పంపించొచ్చు కదా వరుణ్ అంటూ రిక్వెస్ట్ లు పెడుతున్నారు అభిమానులు.
కొందరు మరింత ముందుకెళ్లి వరుణ్ తేజ్కి ఇదే మంచి సమయం, ఆయన హోటల్ని ప్రారంభించడానికి అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో నెట్టింట రచ్చ చేస్తుందని చెప్పొచ్చు.
ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఫుడ్ రిలేటెడ్ చాలా రకాల వంటకాలు తినాలనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ క్రమంలో తన భార్య లావణ్య కోరడంతో వరుణ్ వంటగదిలో ఇలా సాహసం చేశాడని చెప్పొచ్చు.
`మిస్టర్` చిత్రంలో కలిసి నటించిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి అప్పుడే ప్రేమలో పడ్డారు. తమ లవ్ స్టోరీని రహస్యంగా నడిపించి రెండేళ్ల క్రితం మ్యారేజ్ చేసుకున్నారు. త్వరలోనే వీరి జీవితంలోకి మరో వ్యక్తి రాబోతుండటం,
వీరిద్దరు పేరెంట్స్ గా ప్రమోట్ కాబోతుండటం విశేషం. ఇక వరుణ్ తేజ్ చివరగా `మట్కా` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఇది పెద్దగా ఆడలేదు. ఇప్పుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు వరుణ్. ఇండో కొరియన్ హర్రర్ కామెడీగా ఈ మూవీ రూపొందుతుంది.