వరుణ్ తేజ్,సాయి పల్లవి కాంబో రిపీట్,డిటేల్స్

By Surya PrakashFirst Published May 16, 2021, 9:39 AM IST
Highlights

 వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ఫిదా సినిమా సూపర్ హిట్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం హిట్ సినిమాకు కొత్తం అర్దం చెప్పినట్లుగా కలెక్షన్స్ వర్షం కురిపించింది. 

హిట్టైన కాంబినేషన్ రిపీట్ అయితే వచ్చే క్రేజేవేరు. అయితే ఆ కాంబినేషన్ మళ్లీ సెట్ అవ్వటానికి మాత్రం చాలా టైమ్ పడుతుంది. వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ఫిదా సినిమా సూపర్ హిట్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం హిట్ సినిమాకు కొత్తం అర్దం చెప్పినట్లుగా కలెక్షన్స్ వర్షం కురిపించింది. సాయి పల్లవి ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారి ఫుల్ బిజీ అయ్యిపోయింది. దాంతో ఇప్పుడు అదే కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా డైరక్టర్, ఏమా కథ అంటారా..

కరోనా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు వరుణ్ తేజ్. ప్రస్తుతం కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో ‘గని’ అనే స్పోర్ట్స్‌ డ్రామా చేస్తున్నారు వరుణ్‌ తేజ్‌. అలాగే అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌తో కలసి ‘ఎఫ్‌ 3’ చిత్రంలోనూ నటిస్తున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఈ రెండు సినిమాల చిత్రీకరణకు బ్రేక్‌ పడింది. ఈ గ్యాప్‌లోనే ‘ఛలో, భీష్మ’ చిత్రాల ఫేమ్‌ వెంకీ కుడుముల చెప్పిన స్టోరీ లైన్‌ విన్నారట వరుణ్‌. వెంకీ చెప్పిన స్టోరీ లైన్‌ నచ్చడంతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వరుణ్‌ తేజ్‌.

 ప్రస్తుతం నటిస్తున్న ‘గని, ఎఫ్‌ 3’ చిత్రాల షూటింగ్‌ పూర్తయిన వెంటనే వెంకీ కుడుముల ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారని సమాచారం. అన్నీ కుదిరితే దసరాకి చిత్రీకరణ మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ నిర్మించనుందని తెలిసింది.ఈ  సినిమాలో వరణ్ సందేశ్ సరసన సాయి పల్లవిని ఎంపిక చేసారు.  ప్రస్తుతం ఈ మేరకు టాక్స్ జరుగుతున్నాయి. అయితే కరోనా సమస్యతో డేట్స్ అందరివీ డిస్ట్రబ్ అయ్యిపోయాయి. దాంతో సాయి పల్లవి తను ఖచ్చితంగా ఫలానా తేదీ నుంచి డేట్స్ ఇవ్వగలను అని చెప్పలేనని అందిట. 
 
 ‘ఛలో’తో దర్శకుడిగా పరిచయమై ఆ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన వెంకీ కుడుముల రెండో సినిమా ‘భీష్మ’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే భీష్మ తర్వాత అనుకోకుండా కొంత గ్యాప్ తీసుకున్న వెంకీ ఇప్పుడు మూడో సినిమాతో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే వరుణ్ కి ఒక నెరేషన్ ఇచ్చాడు. త్వరలోనే ఫైనల్ స్క్రిప్ట్ చెప్పాల్సి ఉంది. ప్రస్తుతం కథకు తుది మెరుగులు దిద్దే పనిలో బిజీగా ఉన్నాడు వెంకీ. ఒకసారి ఫైనల్ స్క్రిప్ట్ చెప్పేసి వరుణ్ తో గ్రీన్ సిగ్నల్ అందుకున్నాక ఈ సినిమా ఎనౌన్స్ అవుతుంది.

click me!