దిల్ రాజుకు కరోనా, టెన్షన్ లో పరిశ్రమ!

By team teluguFirst Published Apr 13, 2021, 9:40 AM IST
Highlights

తాజాగా దిల్ రాజుకు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నాడు దిల్ రాజు. కొన్ని రోజులుగా తనను కలిసిన వాళ్లందరూ వెంటనే వెళ్లి టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరాడు. 

తెలుగు ఇండస్ట్రీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రెండో దశ మొదలైన తర్వాత చాలా మంది సినీ ప్రముఖులు కొవిడ్-19 బారిన పడ్డారు. తాజాగా అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా కరోనా వైరస్ బారిన పడ్డాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మించాలనే తన 22 ఏళ్ల కలను వకీల్ సాబ్ సినిమాతో నెరవేర్చుకున్న దిల్ రాజు.. ఈ సినిమా ప్ర‌చారంలో భాగంగా కొద్ది రోజులుగా ఆడియన్స్‌తో కలిసే ఉన్నాడు. సాధారణ అభిమానులతో క‌లిసి దిల్ రాజు థియేటర్‌లో పేపర్లు ఎగరేయడం కూడా చూశాం. 

ఇదంతా ఇలా ఉంటే తాజాగా దిల్ రాజుకు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నాడు దిల్ రాజు.  కొన్ని రోజులుగా తనను కలిసిన వాళ్లందరూ వెంటనే వెళ్లి టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరాడు. వకీల్ సాబ్ చిత్ర యూనిట్ తో పాటు ఆ సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా చాలా రోజుల నుంచి దిల్ రాజుతోనే ఉన్నాడు. తనకు వైరస్ సోకిన విషయం తెలిసిన వెంటనే క్వారంటైన్ లోకి వెళ్లిపోయాడు ఈ నిర్మాత. 


ఇప్పటికే వకీల్ సాబ్ చిత్ర యూనిట్‌లో హీరోయిన్ నివేదా థామస్ కు కరోనా వచ్చి తగ్గిపోయింది. ఇప్పుడు నిర్మాత దిల్ రాజుకు కరోనా వచ్చింది. దాంతో చిత్ర యూనిట్ కంగారు పడుతున్నారు. కొన్ని రోజులుగా ప్రమోషన్స్ కోసం అందరూ కలిసి ఉండటంతో ఇంకా ఎంతమందికి పాజిటివ్ వస్తుంది అనేది తెలియడం లేదు.


 

click me!