అది నేను కాదు...మొత్తం ఫేక్

By Surya PrakashFirst Published Mar 18, 2021, 10:45 AM IST
Highlights

తెలుగు సినిమా పరిశ్రమలోకి ఉప్పెన సినిమాతో అడుగు పెట్టి ఓవర్ నైట్ లో స్టార్ గా మారారు  వైష్ణ‌వ్ తేజ్‌. తొలి సినిమాతోనే రికార్డ్ క్రియేట్ చేసి వైష్ణ‌వ్ తేజ్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. సినిమా రికార్డ్ స్దాయి వ‌సూళ్ల‌ను సాధించింది. వంద కోట్లు వచ్చిందంటూ అఫీషియల్ గానే ప్రకటన చేసింది సంస్ద. ఏ డెబ్యూ హీరో సినిమాకు రాని క్రేజ్, క‌లెక్ష‌న్స్ ఇవి. అయితే పేరు వచ్చినప్పుడే దాని వెనక కొన్ని సమస్యలూ వస్తూంటాయి.

తెలుగు సినిమా పరిశ్రమలోకి ఉప్పెన సినిమాతో అడుగు పెట్టి ఓవర్ నైట్ లో స్టార్ గా మారారు  వైష్ణ‌వ్ తేజ్‌. తొలి సినిమాతోనే రికార్డ్ క్రియేట్ చేసి వైష్ణ‌వ్ తేజ్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. సినిమా రికార్డ్ స్దాయి వ‌సూళ్ల‌ను సాధించింది. వంద కోట్లు వచ్చిందంటూ అఫీషియల్ గానే ప్రకటన చేసింది సంస్ద. ఏ డెబ్యూ హీరో సినిమాకు రాని క్రేజ్, క‌లెక్ష‌న్స్ ఇవి. అయితే పేరు వచ్చినప్పుడే దాని వెనక కొన్ని సమస్యలూ వస్తూంటాయి. ముఖ్యంగా సెలబ్రెటీలు ఎదుర్కొనేది ఫేక్ ప్రొఫైల్స్. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలలో ఫేక్ ఎక్కౌంట్స్ క్రియేట్ చేస్తూటారు కొందరు కేటు గాళ్లు. 

స్టార్స్ పేరుతో ఎక్కౌంట్ అంటే త్వరగా పాపులారిటీ వస్తుంది. దాంతో ఆ ఎక్కౌంట్ ద్వారా తమకు కావాల్సినవి ప్రమోట్ చేసుకుంటూంటారు. ఇవి ఒక్కోసారి సమస్యలకూ దారి తీస్తూంటాయి. సదరు సెలబ్రెటీల పేరు చెప్పి డబ్బులు వసూలు చేయటం వంటివి చేస్తూంటారు. ఇవన్ని యంగ్ హీరో వైష్ణవ్ తేజకు తెలియనివి కాదు. అందుకే తనకు ఇనిస్ట్రాలో తప్ప మరెక్కడా ఎక్కౌంట్ లేదని అఫీషియల్ గా ప్రకటించారు. మిగతా చోట్ల ఉన్న ఎక్కౌంట్స్ తనవి కాదని, అవన్ని ఫేక్ అని తేల్చేసాడు. త్వరగానే మేలుకున్నాడనే చెప్పాలి. 


ఇక కెరీర్ విషయానికి వస్తే..  వైష్ణ‌వ్ తేజ్ తొలి సినిమా ఉప్పెన విడుద‌ల కాక ముందే మ‌రో సినిమాలో న‌టించేశాడు. డైరెక్ట‌ర్ క్రిష్ ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందిన చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్‌తో క‌లిసి వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కూడా విడుద‌ల‌కు సిద్ధమ‌వుతోంది. ఈ సినిమా విడుద‌ల కాక ముందే ఉప్పెన విడుద‌ల కావ‌డం, సెన్సేష‌న‌ల్ హిట్ కావ‌డంతో వైష్ణ‌వ్‌తేజ్‌కు స్టార్ ఇమేజ్ వ‌చ్చేసింది.

అలాగే అన్నపూర్ణ స్టూడియోస్.. వైష్ణ‌వ్ తేజ్‌తో సినిమా చేయ‌డానికి డేట్స్ తీసేసుకుంద‌ని తెలుస్తోంది. వైష్ణవ్ తేజ్‌తో అన్నపూర్ణ బ్యాన‌ర్‌పై అక్కినేని నాగార్జున సినిమాను నిర్మించ‌బోతున్నాడు. ఈ సినిమాతో పృథ్వీ అనే ద‌ర్శ‌కుడు ప‌రిచ‌యం అవుతుండ‌టం విశేషం. జూలై నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.
 
 

click me!