తాత బయోపిక్ తీస్తాను.. ప్రకటించిన మెగా కోడలు ఉపాసన

By Mahesh JujjuriFirst Published Feb 6, 2024, 10:36 AM IST
Highlights

ఆమధ్య వరుసగా బయోపిక్ మూవీస్ వచ్చాయి కాని.. ఆ ప్రవాహం ఈమధ్య ఆగిపోయింది. ఏవో ఒకటి రెండు తప్పించి ఇండస్ట్రీలో పెద్దగా బయోపిక్ మూవీస్ కనిపించడం లేదు. ఈక్రమంలోతాజాగా మరోబయోపిక్ మూవీకి భారీ ఎత్తున రంగం సిద్ధం అయినట్టు తెలుస్తోంది. 
 

ఇప్పటికే ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో  ఎన్నో బయోపిక్ మూవీస్ వచ్చాయి. అందులో ప్రజాదరన పొందిన సినిమాలెన్నో ఉన్నాయి. రాజకీయ నాయకులు, సినిమా స్టార్స్ , క్రికెటర్లు, ఇతర క్రిడాకారులు.. ఇలా అన్ని రంగాల నుంచి ప్రముఖుల బయోపిక్ మూవీస్ వచ్చాయి  వస్తున్నాయి. ఇకతాజాగా మరో బయోపిక్ మూవీ కోసం రంగం సద్దం అవుతోంది. అది కూడా వైధ్యరంగంలో సంచలనాలు సృష్టిచిన అపోలో హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ చైర్మెన్ డాక్టర్ ప్రతాప్ చంద్రారెడ్డి బయెపిక్ త్వరలో తెరపై సందడి చేయబోతోంది. 

ఇంతకీ ఈ మూవీ తీయబోయేది ఎవరో కాదు.. ఆయన మనవరాలు, మెగా ఫ్యామిలీ పెద్ద కోడలు  ఉపాసన కొనిదెల. అవును . ప్రతాప్ చంద్ర రెడ్డి అపోలో () హాస్పిటల్స్ ఫౌండర్ గా దేశ విదేశాల్లో అపోలో సేవలని విస్తరించి హెల్త్ కేర్ రంగంలో అరుదైన ఖ్యాతి గడించారు. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఉపాసన తన స్ఫూర్తి తాతయ్య అని చాలా సార్లు చెప్పింది. ఉపాసన కూడా ప్రస్తుతం అపోలో భాద్యతలు చూసుకుంటుంది. 
రీసెంట్ గా 91 వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు ప్రతాప్ రెడ్డి.  ఈసందర్భంగా ది అపోలో స్టోరీ అనే పుస్తకాన్ని లాంచ్ చేశారు. ఈ బుక్ లో .. ప్రతాప్ రెడ్డి అంచలంచెలుగా ఎలా ఎదిగారు అనేది చూపించారు. ఆయన అపోలో హాస్పిటల్స్ ను స్టాపించడం, ఆసంస్థ ఎదిగిన విధానంతో పాటు.. ఈ జర్నీలో ఆయన ఎదురుకొన్న సవాళ్లు.. కష్టాలు, ఇలా అపోలో చరిత్రలోని అంశాలను ది అపోలో స్టోరీలో రాసుకోచ్చారు. ప్రతాప్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో ఈ పుస్తకాన్ని లాంచ్ చేశారు. 

Latest Videos

 

ఈ వేడుకల్లో ఉపాసన సందడి చేశారు. ఇక ఆవిష్కరణ అనంతరం ఉపాసన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తన తాతయ్యతాతయ్య తన కూతుళ్లలో ఎలా స్ఫూర్తి నింపారు,అపోలో సంస్థలు ఎలా ఎదిగాయి.. అనే అంశాలపై మాట్లాడారు. ఈ పుస్తకం చదివిన ప్రతీ ఒక్కరూ స్పూర్తి పొందాలన్నారు. అంతే కాదు ప్రతీ తండ్రి ఈ పుస్తకం చదవాలని.. కోరుకున్నారు.  అంతే కాదు ఈ సందర్భాగా ఓ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు ఉపాసన.  పుస్తకం రిలీజ్ చేశారు కదా.. మరి మీ తాతగారి బయోపిక్ ఏమైనా చేసే ఆలోచన ఉందా అని మీడియా నుంచి ఉపాసనకు ప్రశ్న ఎదురయ్యింది. 

ఇక ఆమెమాట్లాడుతూ..అవును ఆ ఆలోచన కూడా ఉంది.. ముందు ముందు  భవిష్యత్తులో అది కూడా జరగొచ్చు అని తెలిపింది. రామ్ చరణ్ అందులో నటిస్తాడా అని అడగ్గా.. అది డైరెక్టర్ విజన్ బట్టి ఉంటుందని తెలిపింది. దీంతో ఉపాసన  తన తాతయ్య ప్రతాప్ చంద్ర రెడ్డి బయోపిక్ తీసే ఆలోచనలో ఉన్నట్టుతెలుస్తోంది. అంతే కాదు అతి త్వరలోనే ఈ బయోపిక్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

click me!