తాజాగా మరో సర్పైజ్ ఇచ్చింది శోభా. ప్రియుడు యశ్వంత్ రెడ్డి తో నిశ్చితార్థం చేసుకున్నట్లు తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియొ పెట్టింది. ఈ వీడియోలో ఇద్దరు పూల దండలు మార్చుకున్నారు.
బిగ్ బాస్ బ్యూటీ శోభా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సీరియల్ నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది శోభా. పలు టీవీ సీరియల్స్ లో నటించినప్పటికీ కార్తీకదీపం సీరియల్ లో మోనితగా బాగా గుర్తింపు వచ్చింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 7 లో అవకాశం దక్కించుకుని కంటెస్టెంట్ గా హౌస్ లో అడుగుపెట్టింది. సీరియల్ బ్యాచ్ సభ్యులు అమర్ దీప్, ప్రియాంక లతో కలిసి గ్రూప్ గేమ్ ఆడింది శోభా శెట్టి.
తన ప్రవర్తనతో నెగిటివిటీ మూటగట్టుకున్న శోభా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురైంది. పైగా ఆమె నామినేషన్స్ లో ఉన్న ప్రతిసారీ లీస్ట్ ఓటింగ్ తో ఉన్నా కూడా సేవ్ అవ్వడంతో విమర్శలు వచ్చాయి. ఏది ఏమైనప్పటికి 14 వారాలు హౌస్ లో జర్నీ కొనసాగించింది శోభా శెట్టి. అయితే హౌస్ ఉన్నపుడు శోభా తన ప్రేమ గురించి ఆడియన్స్ తో పంచుకుంది. కార్తీకదీపం సీరియల్ లో నటించిన యశ్వంత్ రెడ్డి తన ప్రియుడంటూ షాక్ ఇచ్చింది.
ఇప్పుడు తాజాగా మరో సర్పైజ్ ఇచ్చింది శోభా. ప్రియుడు యశ్వంత్ రెడ్డి తో నిశ్చితార్థం చేసుకున్నట్లు తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియొ పెట్టింది. ఈ వీడియోలో ఇద్దరు పూల దండలు మార్చుకున్నారు. తర్వాత ఉంగరాలు మార్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఒక టీవీ షో ప్రోగ్రామ్ కోసమే శోభా, యశ్వంత్ లు ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా శోభా దీని గురించి మాట్లాడుతూ .. ' యశ్వంత్ నా కోసం సర్ప్రైజ్ ఇవ్వడానికి టీవీ షోకు వస్తాడని అసలు ఊహించలేదు. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. స్టేజి పైనే మాకు ఎంగేజ్మెంట్ కూడా చేయించారు. యశ్వంత్ రింగ్ తీసుకొచ్చాడు. మేము దండలు కూడా మార్చుకున్నాము. అలాగే ఒక గిఫ్ట్ కూడా ఇచ్చాడు. నేను, యశ్వంత్ ఓ టీవీ షో లో కనిపించడం ఇదే ఫస్ట్ టైం. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ శోభా శెట్టి చెప్పుకొచ్చింది.