ఆ డాక్టర్లే నా తండ్రిని చంపేశారు..ఎవ్వరినీ వదలా.. నటి సంభావన ఫైర్‌

By Aithagoni RajuFirst Published May 23, 2021, 8:46 PM IST
Highlights

టీవీ నటి సంభావన సేత్‌ డాక్టర్లపై ఫైర్‌ అయ్యారు. తన తండ్రిని ఆ డాక్టర్లే దారుణంగా చంపేశారని వాపోయింది. ఈ మేరకు ఆమె తీవ్ర స్థాయిలో డాక్టర్లపై ఆరోపణలు చేసింది. 

టీవీ నటి సంభావన సేత్‌ డాక్టర్లపై ఫైర్‌ అయ్యారు. తన తండ్రిని ఆ డాక్టర్లే దారుణంగా చంపేశారని వాపోయింది. ఈ మేరకు ఆమె తీవ్ర స్థాయిలో డాక్టర్లపై ఆరోపణలు చేసింది. సంభావన తండ్రి ఇటీవల కరోనాతో కన్నుమూశారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తండ్రి చనిపోయారని ఆమె ఆరోపిస్తుంది. తమ ఫాదర్‌ని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని, ఆక్సిజన్‌ లెవల్స్ తక్కువగా ఉన్నప్పటికీ వైద్యులు పట్టించుకోలేదని ఈ కారణంగానే ఆయన చనిపోయాడని నటి మండిపడ్డింది. ఎవ్వరినీ వదిలి పెట్టనని హెచ్చరించింది. 

ఈ మేరకు సంభావన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని పంచుకుంది. ఇందులో ఆమె మాట్లాడుతూ, `డాక్టర్లు దేవుళ్లు కాదు..  వారిలో మనలాంటి వాళ్లను హత్య చేసే రాక్షసులు కూడా ఉన్నారు. వాళ్లే నా తండ్రిని చంపేశారు. తండ్రిని కోల్పోవడం అనేది నా జీవితంలోనే ఓ భయంకరమైన పరిస్థితి. కానీ నేను ఇప్పుడు ధైర్యంగా ముందడుగు వేస్తాను. నా తండ్రి నేర్పిన బాటలోనే న్యాయం కోసం పోరాడుతాను. ఈ పోరాటంలో నేను గెలిచినా గెలవకపోయినా కొందరిని కచ్చితంగా బయటకు లాగి వారి నిజ స్వరూపాన్ని చూపిస్తాను.

నా తండ్రి చావుకు కారణమైన జైపూర్‌ గోల్డెన్‌ ఆస్పత్రికి లీగల్‌ నోటీసులు పంపాం. మీలో చాలామంది ఇలాంటి కష్టాన్ని ఎదుర్కొనే ఉంటారు. కానీ అనేక కారణాల వల్ల వాటిని ఎదురించలేకపోవచ్చు. ఇప్పుడు మాత్రం నా పోరాటానికి మద్దతు తెలపండి` అని అభ్యర్థించింది సంభావన. దీనికి అభిమానులు మద్దతు పలుకుతున్నారు. మీకు అండగా ఉంటామని కామెంట్ల ద్వారా సపోర్ట్ చేస్తున్నారు.

click me!