ప్రముఖ బుల్లితెర నటి మృతి.. తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఫ్యామిలీ.. ఇల్లు, కారు అమ్మేసిన భర్త

By team teluguFirst Published Sep 19, 2022, 11:45 AM IST
Highlights

చిత్ర పరిశ్రమలో తరచుగా జరుగుతున్న పరిణామాలు కలవరపెడుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి నిషి సింగ్ (50) తుదిశ్వాస విడిచారు.

చిత్ర పరిశ్రమలో తరచుగా జరుగుతున్న పరిణామాలు కలవరపెడుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి నిషి సింగ్ (50) తుదిశ్వాస విడిచారు. తక్కువ వయసులోనే ఆమె మరణించడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నిషి సింగ్ బుల్లితెరపై, సినిమాల్లోనూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. 

ముఖ్యంగా బుల్లితెరపై కాబుల్ హై అనే సీరియల్ ఆమెకి ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. నిషి సింగ్ ఆదివారం రోజు మరణించినట్లు ఆమె భర్త సంజయ్ సింగ్ తెలిపారు. సంజయ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. గత మూడేళ్ళుగా నిషి సింగ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. 

2019లో ఆమెకి పక్షవాతం వచ్చినట్లు తెలుస్తోంది. 2020లో ఆమె ఆరోగ్యం ఇంకాస్త క్షీణించింది అని సంజయ్ తెలిపారు. ఆమె వైద్యం కోసం ఆర్థిక సహాయం కోరినట్లుగా కూడా సంజయ్ పేర్కొన్నారు. ఇటీవల మా ఆర్థిక పరిస్థితి బాగా క్షీణించింది. 

గత కొన్ని వారాలుగా ఆమెకి గొంతు ఇన్ఫెక్షన్ సోకింది. దీనితో ద్రవపదార్థాలు మాత్రమే అందించాం. రెండు రోజుల క్రితం నిషి 50 వ జన్మదిన వేడుకలు జరిపాం. నిషి మాట్లాడలేనప్పటికీ సంతోషం వ్యక్తం చేసింది. కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది. తాము తీవ్ర శోకంలో మునిగిపోయినట్లు సంజయ్ కన్నీటి పర్యంతం అయ్యారు. 

నిషి సింగ్, సంజయ్ లకు ఒక కుమార్తె, కుమారుడు సంతానం. నిషి వైద్యం కోసం ఇటీవల తమ కారు, ఇల్లు రెండూ అమ్మేసినట్లు సంజయ్ తెలిపారు. చిత్ర పరిశ్రమలో తనకి చాలా మంది స్నేహితులు ఉన్నారని.. ఎవరో ఒకరు తమని ఆదుకోవాలని సంజయ్ రిక్వస్ట్ చేస్తున్నాడు. 

click me!