దర్శక నిర్మాతల తీరుకు హర్ట్ అయిన త్రిష... కనీసం ఆమెకు చెప్పకుండా...

By team teluguFirst Published Mar 20, 2021, 12:25 PM IST
Highlights

త్రిష ప్రతిష్టాత్మక 60వ చిత్రంగా తెరకెక్కింది ‘పరమపథం విలయాట్టు’  దర్శకుడు తిరుగ్ననం  తెరకెక్కించగా 24 ఫ్రెమ్స్ ప్రొడక్షన్‌లో నిర్మించారు. ఈ చిత్రంలో త్రిష డాక్టర్‌ రోల్ చేయడం విశేషం. లేడి ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ విజయంపై త్రిష చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి అయినప్పటికీ, కరోనా వైరస్ కారణంగా థియేటర్స్ మూతపడడంతో విడుదల కాలేదు.

 

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించారు త్రిష. ప్రస్తుతం ఆమె కోలీవుడ్ లో వరుస లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య మూవీలో త్రిష నటించాల్సి ఉండగా.. మధ్యలో ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. అయితే చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్ లో త్రిష హీరోయిన్ గా ఎంపికయ్యారని వార్తలు వస్తున్నాయి. 
 

త్రిష ప్రతిష్టాత్మక 60వ చిత్రంగా తెరకెక్కింది ‘పరమపథం విలయాట్టు’  దర్శకుడు తిరుగ్ననం  తెరకెక్కించగా 24 ఫ్రెమ్స్ ప్రొడక్షన్‌లో నిర్మించారు. ఈ చిత్రంలో త్రిష డాక్టర్‌ రోల్ చేయడం విశేషం. లేడి ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ విజయంపై త్రిష చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి అయినప్పటికీ, కరోనా వైరస్ కారణంగా థియేటర్స్ మూతపడడంతో విడుదల కాలేదు.  


అయితే ఇప్పుడు పరిస్థితి యధాస్థితికి రావంతో సినిమా థియేటర్స్ తిరిగి తెరుచుకున్నాయి. అయినప్పటికీ పరమపథం విలయాట్టు చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేస్తూ నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం త్రిషకు కనీసం చెప్పను కూడా లేదట. మంచి నటన కనబరిచిన చిత్రం థియేటర్స్ లో విడుదల అయితే... తన కెరీర్ కి ప్లస్ అవుతుందని త్రిష భావించారట. ఆమె ఆశలకు వ్యతిరేకంగా దర్శక నిర్మాతలు తీసుకున్న నిర్ణయం త్రిషను హర్ట్ చేసిందట. పరమపథం విలయాట్టు మూవీ త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.
 

click me!