టాలీవుడ్ లో విషాదం యువ నిర్మాత కన్నుమూత!

Published : Mar 01, 2021, 07:38 AM IST
టాలీవుడ్ లో విషాదం యువ నిర్మాత కన్నుమూత!

సారాంశం

 నిర్మాత కొరటాల సందీప్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానికి కారణం గుండెపోటు అని తెలుస్తుంది. ఆదివారం ఆయన తన నివాసంలో ఒక్కసారిగా కూలిపోయారట. కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించగా.. మరణించినట్లు వైద్యులు ద్రువీకరించారని సమాచారం.

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. యువ నిర్మాత అకాల మరణం పొందారు. నిర్మాత కొరటాల సందీప్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానికి కారణం గుండెపోటు అని తెలుస్తుంది. ఆదివారం ఆయన తన నివాసంలో ఒక్కసారిగా కూలిపోయారట. కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించగా.. మరణించినట్లు వైద్యులు ద్రువీకరించారని సమాచారం. 


కొరటాల సందీప్ మరణవార్త పలువురు టాలీవుడ్ ప్రముఖులను విషాదంలో నింపివేసింది. ఆయన మరణానికి దిగ్బ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి సంతాపం ప్రకటిస్తున్నారు. నిన్న కొరటాల సందీప్ స్వగ్రామం గుంటూరు జిల్లా, బాపట్ల మండలం పూండ్లలో అంత్యక్రియలు నిర్వహించారు.  

కొరటాల సందీప్ నిఖిల్ హీరోగా రెండు చిత్రాలు చేశారు. వీడు తేడా, స్వామి రారా చిత్రాలకు ఆయన నిర్మాతగా ఉన్నారు. స్వామిరారా సూపర్ హిట్ కావడంతో పాటు నిఖిల్ కి మంచి బ్రేక్ ఇచ్చింది. అలాగే నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన రౌడీ ఫెలో చిత్రాన్ని కూడా సందీప్ నిర్మించారు. 


 

PREV
click me!

Recommended Stories

Prabhas Assets: లక్ష ఎకరాలు, వేల కోట్లు.. అంబానీని మించిన ప్రభాస్‌ ఫ్యామిలీ ఆస్తులు, మతిపోయే రహస్యాలు
Rashmika Record: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన రష్మిక! పెళ్లి ఫోటో ఆసియాలోనే నంబర్ 1