తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

రజనీకాంత్ సినిమాలో తెలుగు హీరోకి ఆఫర్‌.. డిటెయిల్స్..

Aithagoni Raju | Published : Sep 7, 2023 8:32 PM

ఇటీవల `జైలర్‌` బ్లాక్‌ బస్టర్‌తో జోరు మీదున్నారు రజనీకాంత్‌. నెక్ట్స్ సినిమాకి సిద్ధమవుతున్నాయి. అయితే ఇందులో తెలుగు హీరో నటించబోతున్నారట.   

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ `జైలర్‌` చిత్రంతో సాలిడ్‌గా కమ్‌ బ్యాక్‌ అయ్యారు. తన రేంజ్‌ ఏంటో మరోసారి చూపించారు. ఏజ్‌ పెరిగినా తన క్రేజ్‌ తగ్గలేదని చూపించారు. సరైన సినిమా పడితే బాక్సాఫీసు ఊగిపోవాల్సిందే అని చాటి చెప్పారు. ఇటీవల విడుదలైన `జైలర్‌` చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. కోలీవుడ్‌ గత రికార్డులను బ్రేక్‌ చేసింది. సరికొత్త సంచలనంగా మారింది. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. అంతకు ముందు ఈ దర్శకుడికి హిట్‌ లేదు. కానీ రజనీ అతనిలోని టాలెంట్‌ని నమ్మాడు. ఆ నమ్మకమే నిజమైంది. 

`జైలర్‌` ఆనందంలో ఉన్న రజనీకాంత్‌ ఇప్పుడు నెక్ట్స్ సినిమాకి సిద్ధమవుతున్నాడు. `జై భీమ్‌` దర్శకుడు టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. రజనీ 170వ మూవీగా ఇది రూపొందనుంది. వినాయకచవితి పండుగ సందర్బంగా ఈ సినిమా ప్రారంభం కానుంది. ఇందులో ఇప్పటికే మలయాళ స్టార్‌ ఫహద్‌ ఫాజిల్‌ ముఖ్య పాత్ర కోసం ఎంపికయ్యారు. అలాగే మంజు వారియర్‌ నటిస్తుంది. దీంతోపాటు ఓ తెలుగు స్టార్‌ కూడా ఇందులో భాగం కాబోతున్నారనే వార్తలు వినిపించాయి. 

ప్రధానంగా శర్వానంద్‌, నాని పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా మరో కొత్త పేరు వినిపిస్తుంది. ఈ ఇద్దరు కాదు రానా నటించబోతున్నట్టు తెలుస్తుంది. కీలక పాత్ర కోసం రానాని ఎంపిక చేశారని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్త మాత్రం క్రేజీగా మారింది. ఇప్పుడు పెద్ద స్టార్‌ హీరోల సినిమాలు పాన్‌ ఇండియా లెవల్‌లో విడుదలవుతున్నాయి. దీంతో అన్ని భాషలకు చెందిన నటులను కీలక పాత్రల్లో తీసుకుని అక్కడి మార్కెట్‌ని క్యాప్చర్‌ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమా విషయంలోనూ ఇతర భాషల హీరోలను తీసుకుంటున్నట్టు సమాచారం.

లైకా ప్రొడక్షన్స్ నిర్మించే ఈ చిత్రానికి అనిరుథ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు. `జైలర్‌`కి ఆయనే మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనే విషయం తెలిసిందే. సినిమా సక్సెస్‌లో అనిరుథ్‌ బీజీఎం హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు అదే సక్సెస్‌ని కంటిన్యూ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో రజనీకాంత్‌ ముస్లీం పోసీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారని సమాచారం. 

ఇక రానా ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్ లు చేస్తున్నారు. `హిరణ్య కశ్యప` అందులో ఒకటి. త్రివిక్రమ్‌ దీనికి కథ, మాటలు అందిస్తున్నారు. దీంతోపాటు తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. `నేనే రాజు నేనే మంత్రి`కిది సీక్వెల్‌గా ఉండబోతుందని సమాచారం. మరి ఈ ప్రాజెక్ట్ ఉంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. 
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!