టాలీవుడ్ 'క్వీన్‌' తమన్నా.. చిత్రం ప్రారంభం

Published : Oct 02, 2017, 02:25 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
టాలీవుడ్ 'క్వీన్‌' తమన్నా.. చిత్రం ప్రారంభం

సారాంశం

మెడిఎంటి ఫిలింస్‌ బేనర్‌పై తెలుగు 'క్వీన్‌' మూవీ ప్రారంభం  ఈ మూవీలో టాలీవుడ్ క్వీన్ గా నటిస్తున్న తమన్నా ప్రసాద్ లాబ్స్ లో తెలుగు క్వీన్ చిత్రం ఘనంగా ప్రారంభం

కంగనా రనౌత్‌ నటించిన బాలీవుడ్‌ చిత్రం 'క్వీన్‌' ఎంతటి క్రేజ్ సంపాదించిందో తెలిసిందే. ఈ చిత్రాన్ని మెడిఎంటి తెలుగులో నిర్మిస్తున్నారు. తెలుగులో రీమేక్‌లో తమన్నా టైటిల్‌రోల్‌లో నటిస్తుంది. ప్రముఖ దర్శకుడు పి.కుమారన్‌ తనయుడు మను కుమారన్‌ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు నీలకంఠ ఈ చిత్రానికి దర్శకుడు. ముహుర్తపు సన్నివేశానికి చిత్ర నిర్మాత మను కుమారన్‌ క్లాప్‌ కొట్టగా, వెంకట్‌ స్క్రిప్ట్‌ను అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో... ఎగ్జయిటింగ్‌గా అనిపించింది.


తమన్నా మాట్లాడుతూ - ''హిందీ వెర్షన్‌ చూసిన తర్వాత అమ్మాయిని ఓ హ్యుమన్‌ బీయింగ్‌లా చూడాలనిపించింది. 2014లో క్వీన్‌ సినిమా విడుదలైనప్పుడు ఇక్కడ కూడా రీమేక్‌ చేస్తే బావుంటుందనిపించింది. లక్కీగా ఇప్పుడు నేను ఇందులో నటిస్తున్నాను. మంచి హ్యుమన్‌ ఎమోషన్స్‌ ఉన్న సినిమా. రమేష్‌ అరవింద్‌గారు తమిళం, కన్నడంలో, తెలుగు, మలయాళంలో నీలకంఠగారు సినిమాను చక్కగా డ్రైవ్‌ చేస్తారనే నమ్మకం ఉంది. ఈసినిమాలో నటించడం చాలా ఎగ్జయిటెడ్‌గా అనిపిస్తుంది. తెలుగు హీరోయిన్స్‌ అంటే కమర్షియల్‌ సినిమాల్లో పాటలకే పరిమితం అవుతారని చాలా సందర్భాల్లో చాలా మంది అంటుంటారు. కానీ నా కెరీర్‌ మొత్తంలో నేను విభిన్నమైన పాత్రలెన్నింటినో చేశాను. ఇప్పటి వరకు నాకు సపోర్ట్‌ చేసిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌. నీలకంఠగారితో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. నేను కంగనా రనౌత్‌కు పెద్ద అభిమానిని. సినిమా చూస్తుంటే సినిమాలా కాకుండా నిజంగా మన పక్కన జరుగుతున్నట్లు అనిపించింది. ఇక హిందీ వెర్షన్‌కి, దక్షిణాది రీమేక్‌కు కంపేరిజన్స్‌ ఉంటాయి. ఉండదని అనను. అయితే మా నలుగురు హీరోయిన్స్‌ మా బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. కథ పరంగా చూస్తే. హిందీ వెర్షన్‌కు రీమేక్‌కు తొంబై శాతం వరకు చేంజస్‌ కనపడవు. సినిమాలోని ఆ ఎమోషన్స్‌ను క్యారీ చేయడానికి ప్రయత్నిస్తున్నాం'' అన్నారు. 

 

నాలుగు భాషల్లో రీమేక్‌ చేస్తున్నాం 
చిత్ర నిర్మాత మను కుమారన్‌ మాట్లాడుతూ - ''మహిళా ప్రధానమైన క్వీన్‌ చిత్రాన్ని మా మెడిఎంటి ఫిలింస్‌ సంస్థ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషలో రీమేక్‌ చేస్తుంది. తెలుగులో క్వీన్‌ అనే పేరుతో, తమిళంలో పారిస్‌ పారిస్‌, మలయాళంలో జమ్‌ జమ్‌, కన్నడంలో బట్టర్‌ ఫ్లై పేరుతో రూపొందిస్తున్నాం. నాలుగు భాషల్లో నలుగురు హీరోయిన్స్‌ నటిస్తున్నారు. తెలుగు, మలయాళంలో నీలకంఠ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడంలో సినిమాను ఒకేరోజు విడుదల చేస్తాం'' అన్నారు. 

 

జస్ట్‌ ఫర్‌ లైఫ్‌ అనే క్వీన్‌ 
దర్శకుడు నీలకంఠ మాట్లాడుతూ - ''క్వీన్‌ హిందీ సినిమా చూస్తున్నప్పుడు నాకు సినిమా చూస్తున్నట్లు కాకుండా, ఓ నిజ ఘటనను చూసినట్లుగా ఫీలయ్యాను.హిందీలో వంద కోట్లు సాధించిన లేడీ ఓరియెంటెడ్‌ మూవీ ఇదే. మనం చాలా లవ్‌స్టోరీస్‌ చూసుంటాం. ఇది కూడా ఓ ప్రేమ కథా చిత్రమే. హార్ట్‌ బ్రోకన్‌ లవ్‌స్టోరీ కలిగి ఉన్న ఓ మహిళ కథ. కొత్త అనుభూతినిచ్చే చిత్రం. జస్ట్‌ ఫర్‌ లైఫ్‌ అనేదే సినిమా మెయిన్‌ కాన్సెప్ట్‌. జీవితం అంటేనే మరచిపోలేని జర్నీ. రాణి అనే యువతి తన జీవితంలో జరిగిన విషాదాన్ని పక్కన పెట్టి ఎలా ముందుకు వెళ్లిందనేదే కథ. ఇలాంటి కథను తెలుగులో చేద్దామని అనుకున్నప్పుడు తమన్నాయే మాకు కనపడింది. తను గతంలో హ్యాపీడేస్‌, 100 పర్సెంట్‌ లవ్‌, ఊసరవెళ్లి, అభినేత్రి సినిమాల్లో తమన్నా తన నటనతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. సినిమా అంటే ప్యాషన్‌ ఉన్న తమన్నాగారితో ఈ సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక మను కమారన్‌గారు, నిర్మాతగా వేర్వేరు భాషల్లో పాతిక సినిమాలను చేశారు. ఈ సినిమాను కూడా నాలుగు భాషల్లో నలుగురు హీరోయిన్స్‌ చేస్తున్నారంటే సినిమాపై ఆయకున్న ప్యాషన్‌ అర్థమవుతుంది. అలాగే ఈ సినిమా మలయాళ రీమేక్‌కు కూడా నేనే దర్శకుడిగా పని చేస్తున్నాను. మలయాళంలో దర్శకుడిగా నా డెబ్యూ మూవీ ఇదే. నా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను'' అన్నారు.

PREV
click me!

Recommended Stories

Actor Sreenivasan: ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూత.. 48 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు
Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?