'పెళ్ళిచూపులు' డైరక్టర్ వెళ్తున్నది కరెక్ట్ దారేనా?

By Udaya DFirst Published Feb 15, 2019, 7:55 AM IST
Highlights

సెన్సేషనల్ హిట్ 'పెళ్ళిచూపులు' సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు  తరుణ్ భాస్కర్. ఆ సినిమాతో మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.   కానీ తరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో సినిమా 'ఈ నగరానికి ఏమైంది" డిజాస్టర్ అయ్యింది.

సెన్సేషనల్ హిట్ 'పెళ్ళిచూపులు' సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు  తరుణ్ భాస్కర్. ఆ సినిమాతో మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.   కానీ తరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో సినిమా 'ఈ నగరానికి ఏమైంది" డిజాస్టర్ అయ్యింది. ఈ నేపధ్యంలో తరుణ్ నెక్ట్స్ ఏ ప్రాజెక్టు చేస్తారు అనే విషయంలో గత కొన్ని రోజులుగా స్పెక్యులేషన్లు జోరుగా సాగుతున్నాయి.

మరో ప్రక్క రీసెంట్ గా తరుణ్ సూపర్ స్టార్ మహేష్ బాబును కలిసి కథ వినిపించాడని కూడా వార్తలు వస్తున్నాయి.  అందులో నిజం లేదని తేలింది. మరి తరుణ్ భాస్కర్ తదుపరి కార్యక్రమం ఏమిటి అంటే...కొద్ది కాలం పాటు అంటే నెక్ట్స్ ప్రాజెక్టు కమిటయ్యేదాకా నటనలో బిజిగా ఉండాలనుకుంటున్నారట. 

తాజాగా ఆయన ఫలక్ నామా దాస్ చిత్రంలో టఫ్ పోలీస్ ఆఫీసర్ గా ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నిర్మించనున్న చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నారు. ఆయన సరసన అనసూయ కనిపించబోతోంది.  అలా తరణ్ భాస్కర్ తన క్రియేటివిటిని మొత్తం నటనలో పెట్టబోతున్నారు. అంటే మంచి ఆర్టిస్ట్ ని తెలుగులో మనం త్వరలో చూడబోతున్నాం అన్నమాట. 

అంతేకాకుండా తరుణ్ భాస్కర్ ని మరికొందరు పెద్ద డైరక్టర్స్  తమ చిత్రాల్లో వేషానికి అడుగుతున్నట్లు తెలుస్తోంది. తన పాత్ర నచ్చితే ఖచ్చితంగా చేస్తానని తరుణ్ మాట కూడా ఇచ్చారట. ఇలా నటనా ప్రస్ధానం విజయవంతంగా సాగేటట్లే కనపడుతోంది. ఫలక్ నామా దాస్ సినిమా మంచి హిట్ అయితే మరింత బిజి అయ్యిపోతారు నటుడుగా అని అందరూ భావిస్తున్నారు. అయితే ఆయనలో డైరక్టర్ ని ఇష్టపడేవాళ్లకు ఇలా నటుడుగా ఆయన చేయటం బాధ కలిగిస్తోంది. 

click me!