
నిన్న (25 ఫిబ్రవరి) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ మూవీ. రిలీజ్ అవ్వడంతోనే పాజిటీవ్ టాక్ తో దూసుకుపోతున్న ఈసినిమా భారీ కలెక్షన్స్ లక్ష్యంగా సందడి చేస్తోంది.
రిలీజ్ అవ్వడంతోనే రచ్చ రచ్చ చేస్తుంది భీమ్లానాయక్ సినిమా. నిన్న విడుదలైన ఈ సినిమా థియేటర్ల దగ్గర పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చేస్తోన్న హంగామా మామూలుగా లేదు. థియేటర్ల దగ్గర క్యూలు పెరిగిపోతున్నాయి. జనాలు భారీగా కనపడుతున్నారు. సినిమాకు హిట్ టాక్ రావడంతో ఈ మ్యానియా ఇంకే పెరిగే అవకాశం ఉంది. దాంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. డ్యాన్సులు, కటౌట్లకు పాలాభిషేకాలు, టపాసులు పేల్చుతూ థియేటర్ల వద్ద హోరెత్తిస్తున్నారు.
ఇక ఈ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ పవర్ స్టార్ ప్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. పాటలకు రెచ్చి పోయి ఎగురుతున్నారు పవర స్టార్ ప్యాన్స్. ఇక వారిలో సంగీత దర్శకుడు తమన్ కూడా కలిసిపోయారు. ఓ థియేటర్లో సినిమా చూసేందుకు వెళ్లిన తమన్.. లాల్ లాల్ భీమ్లా పాట వస్తోన్న సమయంలో తెర వద్దకు వెళ్లి అభిమానులతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేశారు. దీంతో అభిమానుల్లో మరింత జోష్ నిండింది. ఈ వీడియోను స్వయంగా తమన్ పోస్ట్ చేశారు.
ఇక రెండో రోజు కూడా భీమ్లా రచ్చ కొససాగుతూనే ఉంది. ఉదయం నుంచి భీమ్లా నాయక్ సినిమా హాళ్ల ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా సైట్స్ లో వైరల్ అవుతున్నాయి. కొన్ని థియేటర్ల వద్ద ఇసుకవేస్తే రాలనంతగా జనం కనిపిస్తున్నారు. అంతే కాదు పవన్ ను విమర్షించిన వాళ్లకు ఫ్యాన్స్ గట్టిగానే కౌంటర్ ఇష్తున్నారు.
ఏపీలో థియేటర్లపై కఠిన నిబంధనలు అమలు అవుతున్నప్పటికీ భారీగానే కలెక్షన్లు వస్తున్నాయి. కరోనా ప్రభావం కూడా తగ్గడంతో జాతరకు తరలివస్తున్నట్లు ప్రేక్షకులు భీమ్లా నాయక్ సినిమాను చూడడానికి వస్తున్నారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్ నటించింది. రానా జోడీగా సంయుక్త మీనన్ నటించారు.