ప్రముఖ టీవీ నటుడు సిద్దాంత్ వీర్ సూర్యవంశీ మృతిచెందారు. జిమ్లో వ్యాయామం చేస్తున్న సమయంలో కుప్పకూలడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
ప్రముఖ టీవీ నటుడు సిద్దాంత్ వీర్ సూర్యవంశీ మృతిచెందారు. జిమ్లో వ్యాయామం చేస్తున్న సమయంలో కుప్పకూలడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. గుండెపోటుతో ఆయన మృతిచెందినట్టుగా తెలుస్తోంది. క్కుసుమ్, వారిస్, సూర్యపుత్ర కర్ణ్ వంటి షోల ద్వారా సిద్దాంత్ వీర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు భార్య అలెసియా రౌత్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సిద్దాంత్ వీర్ మృతి పట్ల నటుడు జై భానుశాలి సంతాపం తెలుపుతూ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టు చేశారు. సిద్దాంత్ వీర్ ఫొటోను షేర్ చేసిన జై భానుశాలి.. ‘‘చాలా త్వరగా వెళ్ళిపోయాడు’’ అని పేర్కొన్నారు.
సిద్దాంత్ వీర్ సూర్యవంశీని.. ఆనంద్ సూర్యవంశీ అని కూడా పిలుస్తారు. మోడల్గా తన కెరీర్ను ప్రారంభించిన సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ.. క్కుసుమ్తో సీరియల్స్లోని తన అరంగేట్రం చేశారు. ఆయన చాలా షోలలో ప్రధాన పాత్రలు కూడా పోషించారు. కసౌతీ జిందగీ కే, కృష్ణ అర్జున్, క్యా దిల్ మే హై వంటి షోలలో కీలక పాత్రల్లో కనిపించారు. అతని చివరి ప్రాజెక్ట్లలో క్యూన్ రిష్టన్ మే కట్టి బట్టి, జిద్ది దిల్ టీవీ షోలు ఉన్నాయి.
ఇక, సిద్దాంత్ గతంలో ఇరాను వివాహం చేసుకున్నారు. అయితే 2015లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2017లో సూపర్ మోడల్ అలెసియా రౌత్తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు.