అజిత్ 'తెగింపు' ట్రైలర్ లో ఇవి గమనించారా? కేక కదా

By Surya PrakashFirst Published Jan 3, 2023, 6:17 AM IST
Highlights

తెలుగులో ఈ సినిమాను 'తెగింపు' పేరుతో రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. 


అజిత్ సినిమా పై ఒక్కసారిగా తెలుగులోనూ క్రేజ్ క్రియేట్ అయ్యింది. అందుకు కారణం తెలుగు ట్రైలర్ వదలటమే. అజిత్, మంజు వారియర్ జంటగా హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తునీవు. తెలుగులో తెగింపు పేరుతో రిలీజ్ కానుంది. బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.  ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను  నిర్మాతలు రిలీజ్ చేశారు. ట్రైలర్ మొత్తం యాక్షన్ మోడ్ లో సాగిపోయింది. ఈ ట్రైలర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 

ఈ ట్రైలర్ లో ....డబ్బు కోసం అజిత్ ఒక బ్యాంక్ ను కొల్లగొట్టాలనుకుంటాడు. దాని కోసం బ్యాంక్ లో ఉన్నారందరిని బందీలను చేస్తాడు. ఇక ఈ విషయం ప్రభుత్వానికి తెలియడం.. ఆ బ్యాంక్ లో కార్పొరేట్ సంస్థ షేర్స్ కోసం ఉంచిన డబ్బు కోట్లలో ఉండడంతో అజిత్ ను ఎలాగైనా అక్కడి నుంచి తప్పించాలని ప్రయత్నిస్తారు. అసలు రా ఏజెంట్ అయిన అజిత్ కు ఈ బ్యాంక్ దోపిడీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. వాళ్ళ టీం మొత్తాన్ని బయట ఉంచి.. అజిత్ మాత్రమే లోపలకు ఎందుకు వెళ్ళాడు. అసలు ఆ డబ్బు ఎవరిది..? ఆ డబ్బు కోసం ఇంతమంది ఎందుకు వెంటపడ్డారు..? అంతకు తెగించి డబ్బు కోసం అజిత్ చేసిన రిస్క్ ఎవరి కోసం..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

మొదటి నుంచి అజిత్ నెగెటివ్ పాత్రలోనే కనిపించాడు. ప్రజల సొమ్మును దోచుకోవడానికి సిగ్గుగా లేదా అని ప్రశ్నిస్తే అస్సలు లేదు అని ఈవిల్ స్మైల్ నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లింది.   యాక్షన్ కి సంబంధించిన సన్నివేశాలపైనే ఈ ట్రైలర్ ను కట్ చేశారు. హెలికాప్టర్లు.. పవర్ బోట్లు.. ఛేజింగ్స్ తో సినిమాలోని భారీతనాన్ని చూపించారు.  మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిర్మితమైంది. ఈ సినిమాలో అజిత్ సరసన నాయికగా మంజూ వారియర్ కనిపించనుంది. ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. 

click me!