పెళ్లి ప్రకటన చేసిన ప్రేమ జంట!

Published : Feb 14, 2019, 12:55 PM IST
పెళ్లి ప్రకటన చేసిన ప్రేమ జంట!

సారాంశం

తమిళ హీరో ఆర్య, సాయేషా సైగల్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఈ విషయంపై ఇప్పటివరకు ఈ జంట స్పందించలేదు. 

తమిళ హీరో ఆర్య, సాయేషా సైగల్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఈ విషయంపై ఇప్పటివరకు ఈ జంట స్పందించలేదు.

ప్రేమికులరోజు సందర్భం పురస్కరించుకొని సాయేషా తన ప్రేమ, పెళ్లి విషయాలపై క్లారిటీ ఇచ్చేసింది. ''మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం.. మీ బ్లెస్సింగ్స్  కావాలి'' అంటూ సోషల్ మీడియా వేదికగా ఆర్యతో ఉన్న ఫోటోని షేర్ చేసి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది ఈ బ్యూటీ.

'మా తల్లితండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల ఆశీస్సులతో మా జీవితాలలో అతి ముఖ్యమైన రోజు గురించి షేర్ చేయాలనుకుంటున్నాం.. ఈ సరికొత్త జీవిత ప్రయాణంలో మీ ప్రేమాభిమానాలు కావాలంటూ' ట్వీట్ చేసింది సాయేషా. ఆర్య కూడా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు.

ఈ జంటకి సినీ సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మార్చిలో ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది. ప్రస్తుతం సూర్య 'కాప్పాన్' సినిమాలో ఆర్య విలన్ గా నటిస్తుంటే.. అదే సినిమాలో సాయేషా హీరోయిన్ గా నటిస్తోంది. 

 

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?