సూర్య 'ఎన్‌జీకే' టీజర్!

By Udaya DFirst Published Feb 14, 2019, 12:40 PM IST
Highlights

స్టార్ హీరో సూర్య నటిస్తోన్న నూతన చిత్రం 'ఎన్‌జీకే'. సెల్వ రాఘవన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి హీరోయిన్లుగా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. 

స్టార్ హీరో సూర్య నటిస్తోన్న నూతన చిత్రం 'ఎన్‌జీకే'. సెల్వ రాఘవన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి హీరోయిన్లుగా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

'నా పేరు ఎన్‌జీకే.. నందగోపాల కృష్ణ.. ప్రజలు నన్ను ఎన్‌జీకే అని పిలుస్తారు' అంటూ సూర్య చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలైంది. టీజర్ ని బట్టి సినిమా రాజకీయాల నేపధ్యంలో సాగే కథగా తెలుస్తోంది. 'నీలాంటి వాడు రాజేకీయాల్లోకి వస్తే ఈ ఊరు ఎంత బాగుటుందో ఆలోచించి చూశాను' అంటూ వినిపించిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది.

సాయి పల్లవి.. సూర్య భార్యగా కనిపించింది. మరి రాజాకీయాల్లో హీరో ఎలాంటి సత్తా చాటాడో సినిమా చూసి తెలుసుకోవాలి. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. 

click me!