సినిమా కథ అనుకుంటున్నప్పుడే ఫలానా వాళ్లు అయితే బాగుంటారు అని ఫిక్స్ అవుతూంటారు. వారి కోసం ప్రయత్నించటం ..కుదరకపోతే వేరే వారిని అనుకుని...కథ వారికి అనుగుణంగా చిన్న చిన్న మార్పులు చేయటం జరిగింది. అలాగే సినిమాలో వచ్చే ఐటం సాంగ్స్ విషయంలోనూ ఎవరి చేత చేయించాలి
సినిమా కథ అనుకుంటున్నప్పుడే ఫలానా వాళ్లు అయితే బాగుంటారు అని ఫిక్స్ అవుతూంటారు. వారి కోసం ప్రయత్నించటం ..కుదరకపోతే వేరే వారిని అనుకుని...కథ వారికి అనుగుణంగా చిన్న చిన్న మార్పులు చేయటం జరిగింది. అలాగే సినిమాలో వచ్చే ఐటం సాంగ్స్ విషయంలోనూ ఎవరి చేత చేయించాలి అనేది ఎప్పుడు పెద్ద సినిమాలకు ఎదురయ్యే ప్రశ్నే. ఎందుకంటే క్రేజ్ ఉన్నవాళ్లతో చేయిస్తేనే ఆ లుక్ వస్తుంది. ఈ మధ్యన హీరోయిన్స్ తో ఐటం సాంగ్స్ చేయచటం అనే ట్రెండ్ మొదలైంది. అఫ్ కోర్స్ దాన్ని స్పెషల్ సాంగ్ అంటున్నారు.
అలాంటి సాంగ్ నే చైతూ సినిమా ‘సవ్యసాచి’లో అనుకున్నారు. ఆ పాటలో తమన్నా అయితే బాగుందనుకున్నారు. అదే వార్తలు సైతం బయిట వచ్చాయి. అయితే తమన్నా కాకుండా హీరోయిన్ తోనే దాన్ని లాగించేసేరు. దాంతో అందరూ తమన్నా అడిగినంత ఇవ్వటం కష్టమని ,బడ్జెట్ కంట్రోలు కోసం హీరోయిన్ తోనే చేయించేసారు అనుకున్నారు. మీడియా కూడా అలాంటి ప్రచారమే చేసింది. అయితే అందులో నిజం లేదని, అసలు జరిగింది ఇదే అంటూ నిర్మాతలు చెప్పుకొచ్చారు. అదేమిటో చూద్దాం.
అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం ‘సవ్యసాచి’. నిధి అగర్వాల్ హీరోయిన్ గా రూపొందిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అలనాటి పాట ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయత్తు’ను రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ పాట కోసం స్పెషల్ గా తమన్నను తీసుకున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. నిన్న రిలీజ్ చేసిన వీడియోలో తమన్నా లేకుండానే ఆ సాంగ్ పిక్చరైజ్ చేశారని అర్దమైంది. బడ్జెట్ పెరిగిపోతుందనే కారణంతోనే తమన్ను తప్పించి, ఆ పాట తీశారంటూ అప్పట్లో వచ్చిన రూమర్స్ కు ఇది బలం చేకూర్చినట్లైంది. ఈ విషయమై నిర్మాతను అడగటం జరిగింది.సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, మోహన్, రవి. తమన్నను ఎందుకు తప్పించాల్సి వచ్చిందో వివరంగా చెప్పుకొచ్చారు.
స్వయంగా "సవ్యసాచి" నిర్మాతలు స్పందిస్తూ.... "మీరంతా భావిస్తున్నట్లు తమన్నా విషయంలో రాజీ పడలేదు. మొదట తమన్నతో డిస్కషన్లు పూర్తయ్యాయి. అంతా ఓకే అన్నాం. అయితే కథలో ఆ పాట వచ్చే సిచ్యుయేషన్ లో బయట నుంచి ఓ అమ్మాయి వచ్చి డాన్స్ చేస్తే బాగుండదు అనిపించింది. కథ ప్రకారం వచ్చే ఆ రీమిక్స్ పాటలో మరో హీరోయిన్ ను తెస్తే ఫిట్ అవ్వదని డైరక్టర్ చెప్పడంతో తమన్నాను తీసుకోలేదు." అలాగే "సవ్యసాచి" సినిమా కథ కాలేజ్ లో ఓపెన్ అవుతుందని, స్టూడెంట్స్ మధ్య ఆ రీమిక్స్ పాట వస్తుందని ఆ సిట్యువేషన్ లో సడెన్ గా మరో హీరోయిన్ కనిపిస్తే బాగుండదని అంతా ఫీలయ్యామని అంటున్నారు.
ఇక ఈ ఒరిజినల్ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడారు. రీమిక్స్ వెర్షన్ పాటను పృథ్వీ చంద్ర, మౌనిమ ఆలపించారు. ‘సవ్యసాచి’ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్, రవి, మోహన్ చెరుకూరి నిర్మించారు. మాధవన్, భూమిక కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం మన ముందుకు రాబోతోంది.