మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. ఆంగ్లేయులను ఎందిరించిన మొట్ట మొదటి తెలుగు విప్లవ నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు.
తల్లి కోరిక మేరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దాదాపు 250 కోట్ల బడ్జెట్తో భారీ బడ్జెట్తో తన తండ్రికి కానుకగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంపై చాలా అంచనాలే ఉన్నాయి. ఈ స్దాయి బడ్జెట్ పెట్టుతూండటంతో సినిమా రిలీజ్ టైమ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రెండు నెలల క్రితం వినయ విధేయ రామ సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చరణ్, సైరాను దసరా సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. అయితే అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం షూటింగ్ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. బీదర్ పోర్ట్ సెట్ వేస్తున్నారు. ఆ సెట్ పూర్తయ్యి...అక్కడ షూటింగ్ జరగాలి. అలాగే మరికొన్ని చోట్ల ఈ చిత్రం షూటింగ్ బాలెన్స్ ఉందని సమాచారం.
ఎప్పటికప్పుడు సీన్స్ చెక్ చేసుకుంటూ అవసరమనుకుంటే రీ షూట్ చేసుకుంటూ ముందుకు వెల్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడా చిన్న షాట్ విషయంలో కూడా కాంప్రమైజ్ కావటం లేదు. దాంతో షూటింగ్ అనుకున్న టైమ్ కు పూర్తవటం కష్టమే అంటున్నారు. అప్పుడు దసరాకు రిలీజ్ చేయలేదు..అలాంటి పెద్ద పండుగ మళ్లీ సంక్రాతి. అప్పటిదాకా ఆగుతారా చూడాలి.
ఈ సినిమాలో చిరు సరసన నయనతార హీరోయిన్గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, తమన్నా, సుధీప్, విజయ్ సేతుపతిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.