సుశాంత్‌ కేసులో వాస్తవాలను తెలుసుకోవడం అందరి హక్కు.. శ్వేతా సింగ్‌

Published : Aug 13, 2020, 02:33 PM IST
సుశాంత్‌ కేసులో వాస్తవాలను తెలుసుకోవడం అందరి హక్కు.. శ్వేతా సింగ్‌

సారాంశం

సుశాంత్‌ కేసుకు సంబంధించి తాజాగా ఆయన సోదరి శ్వేతా సింగ్‌ స్పందించారు. ఆమె తన సోదరుడి మృతి కేసుని నిష్పాక్షికంగా, నిజాయితీగా విచారణ జరపాలని కోరింది. గురువారం ఆమె ఓ వీడియోలో మాట్లాడుతూ, మాకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని తెలిపింది. 

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు ఉత్కంఠకు గురి చేస్తుంది. ఆయనకు సంబంధించిన అనేక కొత్త విషయాలు బయటపడుతున్నాయి. విచారించే కొద్ది కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. ఇంతకి సుశాంత్‌ది ఆత్మహత్యా? హత్యా? అనే అనుమానాలను వారి కుటుంబం నుంచి ఉత్పన్నమవుతుంది.  

దీనిపై ముంబయి పోలీసులు, బీహార్‌ పోలీసులు విచారణ జరుపుతుండగా, సుశాంత్‌ ఫాదర్‌ కేకే సింగ్‌ ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని బీహార్‌ ప్రభుత్వాన్ని కోరారు. బీహార్‌ ప్రభుత్వం సిఫార్సు మేరకు కేంద్రం ఈ కేసుని సీబీఐకి అప్పగించింది. మరోవైపు మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ సైతం రంగంలోకి దిగి ఈ కేసులో ప్రధాన నింధితులురాలిగా భావిస్తున్న రియా చక్రవర్తి, వారి కుటుంబాన్ని ప్రశ్నించి కీలక  సమాచారాన్ని రాబట్టింది. 

ఇదిలా ఉంటే సుశాంత్‌ కేసుకు సంబంధించి తాజాగా ఆయన సోదరి శ్వేతా సింగ్‌ స్పందించారు. ఆమె తన సోదరుడి మృతి కేసుని నిష్పాక్షికంగా, నిజాయితీగా విచారణ జరపాలని కోరింది. గురువారం ఆమె ఓ వీడియోలో మాట్లాడుతూ, మాకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని తెలిపింది. జాతి మొత్తం ఏకతాటిపైకి వచ్చి సుశాంత్‌ కేసులో సీబీఐ విచారణ కోసం డిమాండ్‌ చేయాలని కోరింది. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వాస్తవాలను తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. నిజానిజాలు బయటపడితేనే సుశాంత్‌ కుటుంబం, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రశాంతంగా ఉంటారని తెలిపింది. 

సుశాంత్‌ కేసుని బీహార్‌ పోలీసులు కూడా విచారిస్తుండగా.. ఆ కేసుని ముంబయికి బదిలీ చేయాలని రియా చక్రవర్తి సుప్రీంకోర్ట్ ని ఆశ్రయించారు. దీనిపై కోర్ట్ తీర్పుని వెలువరించాల్సి ఉంది. కేసు కోర్ట్ లో ఉండగా సీబీఐ దర్యాప్తు జరపడం కుదరని రియా తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఇంకా సీబీఐ రంగంలోకి దిగలేదు. నేడు ఈ తీర్పు రానుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?