మహేష్ టూర్ ముగిసింది..సర్కారు వారి పాటకు వేళైనట్లేనా.!

By team teluguFirst Published Nov 17, 2020, 5:55 PM IST
Highlights

ఫ్యామిలీతో విదేశాలకు టూర్ కి వెళ్లిన మహేష్ ముగించుకొని ఇండియాకు పయనమైనట్లు సమాచారం. త్వరలో సర్కారు వారి పాట షూటింగ్ లో మహేష్ పాల్గొనాల్సి ఉంది. షూటింగ్ లో బిజీ కాకముందే ఫ్యామిలీతో టూర్ కి వెళ్లాలని మహేష్ భావించిన నేపథ్యంలో ఈ టూర్ కి ప్లాన్ చేయడం జరిగింది. మహేష్ టూర్ ముగిసిన నేపథ్యంలో వెంటనే ఆయన సర్కారు వారి పాట మూవీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారని అర్థం అవుతుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ లుక్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. టీ షర్ట్, గాగుల్స్ ధరించి ఉన్న మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ మహేష్ ఫొటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. మార్నింగ్ 3కి ఇంత అందంగా ఎవరు ఉండగలరు. ఇంత అందమైన వ్యక్తి మన ప్రక్కన ఉంటే అసలు సమయం తెలియదని నమ్రత ఆ ఫోటోకి కామెంట్ పెట్టారు. 

ఫ్యామిలీతో విదేశాలకు టూర్ కి వెళ్లిన మహేష్ ముగించుకొని ఇండియాకు పయనమైనట్లు సమాచారం. త్వరలో సర్కారు వారి పాట షూటింగ్ లో మహేష్ పాల్గొనాల్సి ఉంది. షూటింగ్ లో బిజీ కాకముందే ఫ్యామిలీతో టూర్ కి వెళ్లాలని మహేష్ భావించిన నేపథ్యంలో ఈ టూర్ కి ప్లాన్ చేయడం జరిగింది. మహేష్ టూర్ ముగిసిన నేపథ్యంలో వెంటనే ఆయన సర్కారు వారి పాట మూవీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారని అర్థం అవుతుంది. 

దీపావళి కూడా విదేశాలలోనే జరుపుకున్న మహేష్, దర్శకుడు పరుశురామ్ కి దీపావళి గిఫ్ట్ పంపారు. మహేష్ పంపిన గిఫ్ట్  పరుశురామ్ ని ఎంతో సంతోషాన్ని గురి చేసింది. ఇక మహేష్ కోసం పరుశురామ్ సరికొత్త స్క్రిప్ట్ సిద్ధం చేశారు. బ్యాంకింగ్ ఫ్రాడ్స్, ఆర్థిక నేరాల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనుండగా మహేష్ రోల్ బిన్నంగా డిజైన్ చేశాడట. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. 
 

click me!