వామ్మో...కాజల్‌ అగర్వాల్‌ శోభనం సెటప్‌ ఖర్చు అంతా..?

By Surya PrakashFirst Published Nov 17, 2020, 5:25 PM IST
Highlights

నాలుగు రోజుల కింద భర్త గౌతమ్‌తో కలిసి మాల్దీవ్స్‌కు హనీమూన్ వెళ్లింది. అక్కడే కొన్ని రోజులుగా ఎంజాయ్ చేస్తుంది. అయితే ఈమె హనీమూన్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోజుకో రకమైన ఫోటో విడుదల చేస్తూ  అదరకొడుతోంది చందమామ. 


కొత్త జంట కాజల్‌ అగర్వాల్‌, గౌతమ్‌ కిచ్లు మాల్దీవుల్లో ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా వివాహం చేసుకున్న  వీరిద్దరూ హనీమూన్ కోసం మాల్దీవులు వెళ్లారు. అక్కడ ఈ జంట కేక పెట్టిస్తామంటూ ఫొటోలు షేర్ చేస్తున్నారు.ఆ ఫొటోలతో  కాజల్ అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఈ హనీమూన్ లో భాగంగా వీరు సముద్రంలో స్కూబా డైవింగ్ చేశారు. ఇద్దరూ కలిసి సముద్రంలో ఈత కొట్టారు. దానికి సంబంధించిన ఫొటోలను కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. `ప్రపంచం ఒక సముద్రం. అందులో మనం కెరటాలం. కొందరు సర్ఫ్‌ చేయాలనుకుంటారు.. కొందరు డైవ్‌ చేయాలనుకుంటారు` అనే కోట్‌ను కూడా జోడించింది. 
 
ఇలా శోభనం సెటప్పు సముద్రం మధ్యలో వేయటంతో జనాలు అసలు హనీమూన్ కోసం కాజల్ ఎంత ఖర్చుపెడుతోందనే విషయం మాట్లాడుకుంటున్నారు!  కాజల్ జంట మాలేలో ఉంటున్న అండర్ సీ విల్లా ఒక్కరోజు రెంట్‌ ఎంతో చాలా ఖరీదు. అక్షరాలా 36 లక్షలట. ఆ రేంజి ఖర్చుతో కాజల్‌ హనీమున్‌ను ఎంజయ్‌ చేస్తోంది. ఇంత ఖర్చుతో ఇప్పటి వరకు ఏ హీరోయిన్‌ హనీమూన్‌ కు ఇంత ఖర్చు చేయలేదు. ఇక హనీమూన్ ముగించుకుని వచ్చే కాజల్..డిసెంబర్ 5 నుంచి ఆచార్య షూటింగ్ లో పాల్గొనబోతోంది.
 

click me!