Bigg Boss Telugu 5: జర్నీ చూసుకుని కన్నీళ్లు పెట్టుకున్న సన్నీ.. షణ్ముఖ్‌ని బిగ్‌బాస్‌ ఏమన్నాడంటే?

By Aithagoni RajuFirst Published Dec 14, 2021, 11:51 PM IST
Highlights

సోమవారం ఎపిసోడ్‌కి కొనసాగింపుగా మంగళవారం షో జరిగింది. సోమవారం శ్రీరామ్‌, మానస్‌లకు గ్రాండ్‌గా వెల్‌కమ్‌ పలికారు బిగ్‌బాస్‌. నేటి ఎపిసోడ్‌లో షణ్ముఖ్‌, సన్నీలకు గ్రాండ్‌గా ఆహ్వానం పలికారు. 

బిగ్‌బాస్‌ తెలుగు 5(Bigg Boss Telugu 5) వందవ రోజుకి చేరుకుంది. 101 ఎపిసోడ్‌లో భాగంగా మంగళవారం బిగ్‌బాస్‌ టాప్‌ 5 సభ్యులకు గ్రాండ్‌గా వెల్‌కమ్‌ పలికారు. సోమవారం ఎపిసోడ్‌కి కొనసాగింపుగా మంగళవారం షో జరిగింది. సోమవారం శ్రీరామ్‌, మానస్‌లకు గ్రాండ్‌గా వెల్‌కమ్‌ పలికారు బిగ్‌బాస్‌. నేటి ఎపిసోడ్‌లో షణ్ముఖ్‌, సన్నీలకు గ్రాండ్‌గా ఆహ్వానం పలికారు. వారి వారి జర్నీలను చూసుకుని వారు ఎమోషనల్‌ అయ్యారు. మొదట షణ్ముఖ్‌ని పిలిచారు బిగ్‌బాస్‌. హౌజ్‌లో విశాలంగా షణ్ముఖ్‌కి సంబంధించిన మెమరీస్‌ని ఫోటోలు, ఫ్రేమ్‌ల రూపంలో బంధించారు. వాటిని ప్రదర్శించారు. అవి చూసుకుని షణ్ముఖ్‌ ఎంతో ఆనందించారు. 

తననిఇలా చూసుకుని ఉప్పొంగిపోయాడు షణ్ముఖ్‌. అనంతరం షన్ను గురించి బిగ్‌బాస్‌ తనదైన స్టయిల్‌లో చాలా గొప్పగా కీర్తించారు. ప్రశంసించారు. ఆయన ఎంతో కూల్‌లోగా గేమ్‌ ఆడారని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా చాలా కూల్‌గా గేమ్‌ ఆడుతూ, తనని తాను బలంగా మలుచుకుంటు వచ్చారని తెలిపారు. తాను అందరికి కాంపిటీషన్‌ ఇచ్చాడని, ఈ జర్నీలో మంచి స్నేహాలను ఏర్పర్చుకున్నట్టు చెప్పారు. స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్లే మనస్తత్వాన్ని అభినందించారు. తనలోని అనేక ఎమోషనల్‌ని కంట్రోల్‌ చేసుకుని ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూల్‌గా ఉండేలా ప్రయత్నం చేయడాన్ని అభినందించారు. మోజ్‌ రూమ్‌ని ప్రత్యేకంగా గుర్తు చేశారు. ఆ హౌజ్‌లోనే అనేక భావోద్వేగాలను పంచుకున్నావని, దాచుకున్నావని చెప్పారు. అనంతరం షణ్ముఖ్‌ జర్నీచూపించారు. దీంతో షన్ను చాలా ఎమోషనల్‌ అయ్యారు. వెళ్తూ రెండు ఫోటోలను తీసుకున్నారు. అందులో తన అమ్మతో ఉన్నది,రెండు సిరితో ఉన్నది కావడం విశేషం. 

అనంతరం సన్నీని పిలిచారు బిగ్‌బాస్‌. సన్నీ జర్నీ చాలా బాగా సాగిందని చెప్పొచ్చు. అంతేకాదు చాలా ఎమోషనల్‌గానూ ఆ జర్నీని చూపించారు. ఈ జర్నీచూసి సన్నీసైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు సన్నీ. ఇక సన్నీ గురించి బిగ్‌బాస్‌ చెబుతూ, సరదా,సన్నీ రెండు పదాలు ఒకే అక్షరంతో స్టార్ట్ అవుతాయని హౌజ్‌లో ఉన్నన్ని రోజులు ఆడియెన్స్ కి గుర్తు చేశావని తెలిపారు. హౌజ్‌లో ఎన్నో తీపిగుర్తులున్నాయని, నిందని,అవమానాలు ఎన్నో చూశావని తెలిపారు. కోపాన్ని అణచుకుని తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నావని, కోపాన్ని కంట్రోల్‌ చేసుకోవడంలో ఎంతో కష్టపడ్డావని తెలిపారు బిగ్‌బాస్‌. 

నిందలు,అవమానాలు,భరించి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇతరులకు నవ్వులు పంచాలని ప్రయత్నించావని,ఆ విషయంలో సక్సెస్‌ అయినట్టు చెప్పారు బిగ్‌బాస్‌. స్నేహం కోసం ప్రాణమిచ్చేంత గొప్ప హృదయం తనదని చెప్పారు.స్నేహానికి విలువ ఇవ్వడం గురించి ప్రస్తావించారు. ఈ జర్నీలో పలు ఆసక్తికర విషయాలను కూడా చూపించారు. దీంతో సన్నీ ఎమోషనల్‌ అయ్యారు.కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇది వండర్‌ఫుల్‌ జర్నీ అని, ఇలాంటి మూవ్‌మెంట్‌ తనకు ఒక డ్రీమ్‌లా ఉండేదని, ఇప్పుడది ఫుల్‌ఫిల్‌ అయ్యినట్టు తెలిపారు. ఈ ఇంత దూరం తీసుకొచ్చిన ఆడియెన్స్ కి ప్రేమతో ధన్యవాదాలు తెలిపారు సన్నీ.  సన్నీజర్నీ ఆద్యంతం రసవత్తరంగా, ఆకట్టుకునేలా ఉంది. 

ప్రస్తుతం శ్రీరామ్‌, మానస్‌, షణ్ముఖ్‌, సన్నీల జర్నీ పూర్తికాగా, ఇక సిరి మిగిలిపోయింది. ఆమె రేపు ప్రసారం కానున్నట్టు తెలుస్తుంది. బిగ్‌బాస్‌ తెలుగు 5 టాప్‌ ఫైవ్‌లో సన్నీ, శ్రీరామ్‌,షణ్ముఖ్‌, సిరి, మానస్‌లు ఉన్నారు. వీరిలో ఒకరు విన్నర్‌ అనేది ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు 14 వారాలు పూర్తయ్యాయి. చివరగా హౌజ్‌ నుంచి కాజల్‌ ఎలిమినేట్‌ అయ్యింది. వచ్చే ఆదివారంతో ఈ సీజన్‌ పూర్తవుతుంది. 

also read: Payal Rajput: ప్యాంటు లేకుండా కెమెరా ముందుకు... పాయల్ బోల్డ్ అటెంప్ట్ కి ఫ్యాన్స్ టెంప్టింగ్ కామెంట్స్

click me!